ETV Bharat / bharat

'ఆరు నెలల్లో 61మంది ఉగ్రవాదులు హతం'

author img

By

Published : Jul 2, 2021, 8:18 AM IST

జమ్ముకశ్మీర్​లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 61 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. గత నెలలో లాక్​డౌన్​ ఎత్తివేసిన క్రమంలో ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లు వేగవంతం చేసినట్లు జమ్ముకశ్మీర్​ పోలీసు చీఫ్​ దిల్బాగ్​ సింగ్​ తెలిపారు.

Anti terrorist Operations
ఉగ్రవాదుల ఏరివేత

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. 2021 ఏడాది ప్రారంభమైన నాటి నుంచి గడిచిన 6 నెలల్లో మొత్తం 61 మంది ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టినట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. మిలిటెంట్ల కట్టడి ఆపరేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్​డౌన్​తో ఉగ్రమూకల నిర్మూలన ఆపరేషన్లు కాస్త తగ్గినట్లు ఇటీవల వెల్లడించారు జమ్ముకశ్మీర్​ పోలీస్​ చీఫ్​ దిల్బాగ్​ సింగ్​.

"కరోనా లాక్​డౌన్​తో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు కాస్త తగ్గాయి. భద్రతా బలగాలు, ముఖ్యంగా పోలీసు, పారామిలిటరీ దళాలు లాక్​డౌన్​ విధులు నిర్వర్తించటం ద్వారా టెరరిస్టుల వ్యతిరేక ఆపరేషన్లు గతంతో పోలిస్తే.. తగ్గాయి. జమ్ముకశ్మీర్​లో ఈ ఏడాది జరిగిన వివిధ ఘర్షణల్లో 61 మంది ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. అయితే.. గత నెలలో లాక్​డౌన్​ ఆంక్షలు సడలించిన క్రమంలో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేశాయి బలగాలు. "

- దిల్బాగ్​ సింగ్​, జమ్ముకశ్మీర్​ పోలీసు చీఫ్​

శ్రీనగర్​ మలురా ప్రాంతంలో ఇటీవల ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు. కుల్గాంలో రెండు రోజుల క్రితం ముగ్గురిని హతమార్చాయి.

ఇదీ చూడండి: సైన్యానికి అందుబాటులో షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్​ వ్యవస్థ!

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. 2021 ఏడాది ప్రారంభమైన నాటి నుంచి గడిచిన 6 నెలల్లో మొత్తం 61 మంది ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టినట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. మిలిటెంట్ల కట్టడి ఆపరేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్​డౌన్​తో ఉగ్రమూకల నిర్మూలన ఆపరేషన్లు కాస్త తగ్గినట్లు ఇటీవల వెల్లడించారు జమ్ముకశ్మీర్​ పోలీస్​ చీఫ్​ దిల్బాగ్​ సింగ్​.

"కరోనా లాక్​డౌన్​తో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు కాస్త తగ్గాయి. భద్రతా బలగాలు, ముఖ్యంగా పోలీసు, పారామిలిటరీ దళాలు లాక్​డౌన్​ విధులు నిర్వర్తించటం ద్వారా టెరరిస్టుల వ్యతిరేక ఆపరేషన్లు గతంతో పోలిస్తే.. తగ్గాయి. జమ్ముకశ్మీర్​లో ఈ ఏడాది జరిగిన వివిధ ఘర్షణల్లో 61 మంది ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. అయితే.. గత నెలలో లాక్​డౌన్​ ఆంక్షలు సడలించిన క్రమంలో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేశాయి బలగాలు. "

- దిల్బాగ్​ సింగ్​, జమ్ముకశ్మీర్​ పోలీసు చీఫ్​

శ్రీనగర్​ మలురా ప్రాంతంలో ఇటీవల ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు. కుల్గాంలో రెండు రోజుల క్రితం ముగ్గురిని హతమార్చాయి.

ఇదీ చూడండి: సైన్యానికి అందుబాటులో షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్​ వ్యవస్థ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.