రాజస్థాన్లో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఎండలో నడుస్తూ, తాగేందుకు నీరు దొరకక ఓ ఐదేళ్ల చిన్నారి మరణించింది. ఆమె పక్కనే ఉన్న వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది.

ఇదీ జరిగింది..
రాయ్పుర్ నుంచి రాణివాడా తాలూకాలోని రోడా గ్రామానికి ఐదేళ్ల చిన్నారితో బయలుదేరింది సుకి దేవి భిల్. ఎండలు ఎక్కువగా ఉండటం, తాగడానికి నీరు కూడా లేకపోవడం వల్ల వారు ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

స్థానికులు ఈ సమాచారాన్ని సర్పంచ్ కృష్ణ రాజ్పురోహిత్కు అందించారు. ఆయన.. రాణివాడా పోలీసులతో కలిసి ఘటనాస్థలానికి పరుగులు తీశారు. తక్షణమే వైద్య సిబ్బందిని పిలిపించారు. అనంతరం ఆ వృద్ధురాలిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.
చిన్నారి మరణంపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీనియర్ నేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. ఇది ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు.


ఇవీ చూడండి: ఆసుపత్రి 'ఆక్సిజన్ డ్రిల్'- రోగుల ప్రాణాలతో చెలగాటం