ETV Bharat / bharat

లాకర్లలో 91కిలోల బంగారం, 340 కిలోల వెండి.. ఈడీ రైడ్స్​తో గుట్టు రట్టు.. విలువ ఎంతంటే..

author img

By

Published : Sep 14, 2022, 7:26 PM IST

బ్యాంకుల్ని మోసం చేసి రూ.వేల కోట్లు రుణాలు తీసుకున్న కేసులో ఈడీ సోదాలు జరిపింది. ఇందులో భాగంగా ప్రముఖ కంపెనీలకు సంబంధించి కొన్ని ప్రైవేటు లాకర్లలో ఉన్న బంగారం, వెండిని స్వాధీనం చేసుకుంది.

ED Raids in Parekh Aluminex Ltd
ED Raids in Parekh Aluminex Ltd

ED Raids in Parekh Aluminex : బ్యాంకుల్ని మోసం చేసి రూ.వేల కోట్లు రుణాలు తీసుకున్న ఓ సంస్థకు సంబంధించిన కేసులో ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాల్లో మూడు రహస్య లాకర్ల నుంచి భారీగా బంగారం కడ్డీలు, వెండిని స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.47 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

పరేఖ్‌ అల్యూమినెక్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ పలు బ్యాంకుల నుంచి రూ.2,296.58 కోట్లు రుణం తీసుకొని మోసానికి పాల్పడిందన్న ఆరోపణలపై 2018లో ఆ కంపెనీపై మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా రక్షా బులియన్‌, క్లాసిక్‌ మార్బల్స్‌ కంపెనీలపై తాజాగా ఈడీ సోదాలు జరపగా.. రక్షా బులియన్‌ సంస్థకు సంబంధించి కొన్ని ప్రైవేటు లాకర్లు ఉన్నట్టు గుర్తించినట్టు ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ED Raids in Parekh Aluminex Ltd
సీజ్‌ చేసిన సీక్రెట్‌ లాకర్లలో ఉన్న సంపద

అయితే, ఈ ప్రైవేటు లాకర్లను తెరిచిన అధికారులు వాటిలో ఉన్న బంగారం, వెండిని చూసి షాక్‌ అయ్యారు. అలాగే, సరైన నిబంధనలు పాటించకుండా ఈ లాకర్లు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా, కైవేసీ పాటించకపోవడం, ఆ ప్రాంగణంలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారనే సమాచారం తెలిపే సరైన రిజిస్టర్‌ కూడా నిర్వహించలేదని గుర్తించినట్టు ఈడీ అధికారులు ప్రకటనలో తెలిపారు.

అలాగే, అక్కడ మొత్తం 761 లాకర్లు ఉండగా.. మూడు లాకర్లు రక్షా బులియన్‌కు చెందినవిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆ మూడు లాకర్లను తెరవగా రెండు లాకర్లలో 91.5కిలోల బంగారు కడ్డీలు, 152 కిలోల వెండి గుర్తించామనీ.. మరో లాకర్‌లో 188కిలోల వెండి (మొత్తంగా 340 కిలోలు) ఉందని వివరించారు. వీటి విలువ రూ.47.76 కోట్లు ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి 2019లో ఈడీ అధికారులు రూ.205 కోట్లు అటాచ్‌ చేశారు.

ఇదీ చదవండి: కొత్త ట్విస్ట్.. నీతీశ్​తో పీకే భేటీ.. కొత్త కూటమి కోసమేనా?

లిఫ్ట్ ప్రమాదంలో ఏడుగురు కూలీలు దుర్మరణం

ED Raids in Parekh Aluminex : బ్యాంకుల్ని మోసం చేసి రూ.వేల కోట్లు రుణాలు తీసుకున్న ఓ సంస్థకు సంబంధించిన కేసులో ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాల్లో మూడు రహస్య లాకర్ల నుంచి భారీగా బంగారం కడ్డీలు, వెండిని స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.47 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

పరేఖ్‌ అల్యూమినెక్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ పలు బ్యాంకుల నుంచి రూ.2,296.58 కోట్లు రుణం తీసుకొని మోసానికి పాల్పడిందన్న ఆరోపణలపై 2018లో ఆ కంపెనీపై మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా రక్షా బులియన్‌, క్లాసిక్‌ మార్బల్స్‌ కంపెనీలపై తాజాగా ఈడీ సోదాలు జరపగా.. రక్షా బులియన్‌ సంస్థకు సంబంధించి కొన్ని ప్రైవేటు లాకర్లు ఉన్నట్టు గుర్తించినట్టు ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ED Raids in Parekh Aluminex Ltd
సీజ్‌ చేసిన సీక్రెట్‌ లాకర్లలో ఉన్న సంపద

అయితే, ఈ ప్రైవేటు లాకర్లను తెరిచిన అధికారులు వాటిలో ఉన్న బంగారం, వెండిని చూసి షాక్‌ అయ్యారు. అలాగే, సరైన నిబంధనలు పాటించకుండా ఈ లాకర్లు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా, కైవేసీ పాటించకపోవడం, ఆ ప్రాంగణంలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారనే సమాచారం తెలిపే సరైన రిజిస్టర్‌ కూడా నిర్వహించలేదని గుర్తించినట్టు ఈడీ అధికారులు ప్రకటనలో తెలిపారు.

అలాగే, అక్కడ మొత్తం 761 లాకర్లు ఉండగా.. మూడు లాకర్లు రక్షా బులియన్‌కు చెందినవిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆ మూడు లాకర్లను తెరవగా రెండు లాకర్లలో 91.5కిలోల బంగారు కడ్డీలు, 152 కిలోల వెండి గుర్తించామనీ.. మరో లాకర్‌లో 188కిలోల వెండి (మొత్తంగా 340 కిలోలు) ఉందని వివరించారు. వీటి విలువ రూ.47.76 కోట్లు ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి 2019లో ఈడీ అధికారులు రూ.205 కోట్లు అటాచ్‌ చేశారు.

ఇదీ చదవండి: కొత్త ట్విస్ట్.. నీతీశ్​తో పీకే భేటీ.. కొత్త కూటమి కోసమేనా?

లిఫ్ట్ ప్రమాదంలో ఏడుగురు కూలీలు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.