హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది. శనివారం సాయంత్రం 8.21 గంటలకు భూకంపం వచ్చినట్లు సిమ్లా వాతావరణ శాఖ డైరెక్టర్ మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.
కంగ్రా జిల్లాలోని ఈశాన్య ప్రాంతంలో పది కిలోమీటర్ల మేరకు భూకంపం కేంద్రీకృతమైంది. అయితే.. ప్రాణనష్టమేమీ జరగలేదు.
ఇదీ చదవండి:ఐదుగురు లష్కరే తోయిబా అనుచరుల అరెస్టు