ETV Bharat / bharat

రికార్డు స్థాయిలో షిరిడీ సాయినాథుడికి కానుకలు.. రూ.398 కోట్లకుపైగా..

author img

By

Published : Nov 18, 2022, 9:29 AM IST

కొవిడ్​ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి భక్తులు.. షిరిడీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. దీంతో సాయినాథుడికి రికార్డు స్థాయిలో కానుకలు వచ్చాయి. ఈ ఏడాది రూ.398 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Shirdi Sai Baba
షిరిడీ సాయి బాబా

మహారాష్ట్రలోని షిరిడీకి వెళ్లే భక్తులు ఆ సాయినాథుడ్ని దర్శనం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అదే విధంగా బాబా హుండీలో కూడా కానుకలను తమ స్థాయికి తగ్గట్టుగా సమర్పిస్తున్నారు. ఈ ఏడాది బాబా సంస్థాన్​కు రూ.398 కోట్లకు పైగా కానుకలు వచ్చాయి. ఈ విషయాన్ని సాయి సంస్థాన్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు.

కొవిడ్ విజృంభణ తగ్గిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి సుమారు మూడు కోట్ల మంది భక్తులు బాబా దర్శనార్థం విచ్చేశారని ఆమె తెలిపారు. గతేడాది అక్టోబరు నుంచి నవంబరు వరకు సుమారు రూ.398 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. దేశంలో తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం తర్వాత అంతటి రికార్డు స్థాయి హుండీ లెక్కింపులు ఉన్న ఆలయాల్లో షిరిడీ ఒక్కటి.

  • విరాళాల రూపంలో - రూ.77,89,04,984
  • హుండీలో కానుకల రూపంలో - రూ.1,68,88,52,560
  • చెక్కు, డీడీ - రూ.19,68,41,408
  • డెబిట్, క్రెడిట్ కార్డు డొనేషన్ - రూ.42,00,42,120
  • మనీఆర్డర్లు - రూ.2,29,76,564
  • బంగారం - 27కిలోలు
  • వెండి - 3,056కిలోలు
  • మొత్తం బాబా సంస్థాన్ ఆదాయం - రూ.3,98,53,31,511

మహారాష్ట్రలోని షిరిడీకి వెళ్లే భక్తులు ఆ సాయినాథుడ్ని దర్శనం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అదే విధంగా బాబా హుండీలో కూడా కానుకలను తమ స్థాయికి తగ్గట్టుగా సమర్పిస్తున్నారు. ఈ ఏడాది బాబా సంస్థాన్​కు రూ.398 కోట్లకు పైగా కానుకలు వచ్చాయి. ఈ విషయాన్ని సాయి సంస్థాన్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు.

కొవిడ్ విజృంభణ తగ్గిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి సుమారు మూడు కోట్ల మంది భక్తులు బాబా దర్శనార్థం విచ్చేశారని ఆమె తెలిపారు. గతేడాది అక్టోబరు నుంచి నవంబరు వరకు సుమారు రూ.398 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. దేశంలో తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం తర్వాత అంతటి రికార్డు స్థాయి హుండీ లెక్కింపులు ఉన్న ఆలయాల్లో షిరిడీ ఒక్కటి.

  • విరాళాల రూపంలో - రూ.77,89,04,984
  • హుండీలో కానుకల రూపంలో - రూ.1,68,88,52,560
  • చెక్కు, డీడీ - రూ.19,68,41,408
  • డెబిట్, క్రెడిట్ కార్డు డొనేషన్ - రూ.42,00,42,120
  • మనీఆర్డర్లు - రూ.2,29,76,564
  • బంగారం - 27కిలోలు
  • వెండి - 3,056కిలోలు
  • మొత్తం బాబా సంస్థాన్ ఆదాయం - రూ.3,98,53,31,511
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.