ETV Bharat / bharat

సుర్జేవాలా, దిగ్విజయ్ సహా పలువురు ప్రముఖులకు కరోనా - 30 మంది సాధువులకు పాజిటివ్

దేశవ్యాప్తంగా కొవిడ్​ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పలువురు నేతలు కొవిడ్​ బారిన పడినట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. మరోవైపు హరిద్వార్​ కుంభమేళాలో పాల్గొన్న 30 మంది సాధువులకు కొవిడ్​ సోకింది.

రణ్​​దీప్ సింగ్ సుర్జేవాలా, హర్​ సిమ్రత్ కౌర్
randeep singh, harsimrat kaur
author img

By

Published : Apr 16, 2021, 11:15 AM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​ విజృంభిస్తోంది. శుక్రవారం పలువురు ప్రముఖ నేతలు కరోనా​ బారినపడ్డారు.

ఇద్దరు కాంగ్రెస్​ నేతలకు..

కాంగ్రెస్ నేత రణ్​​దీప్ సుర్జేవాలాకు వైరస్​ సోకింది. గత 5 రోజులుగా ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు టెస్టు చేసుకోవాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.

randeep singh tweet
రణ్​దీప్​ ట్వీట్

మరో కాంగ్రెస్​ నేత, మధ్యప్రదేశ్​ మాజీ సీఎం దిగ్విజయ్​ సింగ్​కు కొవిడ్​ సోకింది. ప్రస్తుతం ఆయన దిల్లీలోని తన నివాసంలో హోం క్వారంటైన్​లో ఉన్నట్లు పేర్కొన్నారు.

digvijay singh tweet
దిగ్విజయ్ సింగ్​ ట్వీట్

శిరోమణి అకాలీ దళ్​ నాయకురాలు హర్​ సిమ్రత్ కౌర్ బాదల్​​కు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆమె క్వారెంటైన్​లో ఉన్నట్లు ట్వీట్​లో తెలిపారు.

harsimrat tweet
ట్వీట్ చేసిన హర్​ సిమ్రత్ కౌర్

30 మంది సాధువులకు

ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​ కుంభమేళాలో పాల్గొన్న 30 మంది సాధువులకు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని హరిద్వార్ చీఫ్​ మెడికల్ అధికారి స్పష్టం చేశారు.

"హరిద్వార్​లో 30 మంది సాధువులకు పాజిటివ్​గా తేలింది. అఖాడాల్లోలో వైద్య బృందాలు పర్యటిస్తూ సాధువులకు ఆర్​టీ-పీసీఆర్​ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్​ 17 నుంచి టెస్టుల నిర్వహణను మరింత వేగవంతం చేయనున్నారు."

--డా.ఎస్​కే ఝా, చీఫ్​ మెడికల్ ఆఫీసర్.

కొవిడ్​ సోకిన వారిలో ఆరోగ్యం విషమంగా ఉన్నవారిని రిషికేశ్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు.

ఇదీ చదవండి:నైపుణ్యంతోనే భవితవ్యం- కార్యాచరణే కీలకం!

దేశవ్యాప్తంగా కొవిడ్​ విజృంభిస్తోంది. శుక్రవారం పలువురు ప్రముఖ నేతలు కరోనా​ బారినపడ్డారు.

ఇద్దరు కాంగ్రెస్​ నేతలకు..

కాంగ్రెస్ నేత రణ్​​దీప్ సుర్జేవాలాకు వైరస్​ సోకింది. గత 5 రోజులుగా ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు టెస్టు చేసుకోవాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.

randeep singh tweet
రణ్​దీప్​ ట్వీట్

మరో కాంగ్రెస్​ నేత, మధ్యప్రదేశ్​ మాజీ సీఎం దిగ్విజయ్​ సింగ్​కు కొవిడ్​ సోకింది. ప్రస్తుతం ఆయన దిల్లీలోని తన నివాసంలో హోం క్వారంటైన్​లో ఉన్నట్లు పేర్కొన్నారు.

digvijay singh tweet
దిగ్విజయ్ సింగ్​ ట్వీట్

శిరోమణి అకాలీ దళ్​ నాయకురాలు హర్​ సిమ్రత్ కౌర్ బాదల్​​కు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆమె క్వారెంటైన్​లో ఉన్నట్లు ట్వీట్​లో తెలిపారు.

harsimrat tweet
ట్వీట్ చేసిన హర్​ సిమ్రత్ కౌర్

30 మంది సాధువులకు

ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​ కుంభమేళాలో పాల్గొన్న 30 మంది సాధువులకు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని హరిద్వార్ చీఫ్​ మెడికల్ అధికారి స్పష్టం చేశారు.

"హరిద్వార్​లో 30 మంది సాధువులకు పాజిటివ్​గా తేలింది. అఖాడాల్లోలో వైద్య బృందాలు పర్యటిస్తూ సాధువులకు ఆర్​టీ-పీసీఆర్​ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్​ 17 నుంచి టెస్టుల నిర్వహణను మరింత వేగవంతం చేయనున్నారు."

--డా.ఎస్​కే ఝా, చీఫ్​ మెడికల్ ఆఫీసర్.

కొవిడ్​ సోకిన వారిలో ఆరోగ్యం విషమంగా ఉన్నవారిని రిషికేశ్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు.

ఇదీ చదవండి:నైపుణ్యంతోనే భవితవ్యం- కార్యాచరణే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.