ETV Bharat / bharat

అంధుల హాస్టల్​లో 28 మంది పిల్లలకు కరోనా - కరోనా ఉదయ్​పుర్​

రాజస్థాన్​ ఉదయ్​పుర్​లోని అంధుల హాస్టల్​లో 28 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఆ పాఠశాలలో ఇటీవల ఓ ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధరణ కాగా.. విద్యార్థులందరికీ పరీక్షలు చేయించింది యాజమాన్యం.

28 students of deaf school in Udaipur corona infected
28 మంది అంధ విద్యార్థులకు కరోనా
author img

By

Published : Mar 5, 2021, 3:22 PM IST

రాజస్థాన్ ఉదయ్​పుర్​ అంబమాత పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ప్రజ్ఞచక్షు అంధ విద్యాలయంలో కరోనా కలకలం రేపింది. హాస్టల్​లో 28 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అంధుల పాఠశాలలోని ఓ ఉపాధ్యాయురాలికి ఇటీవల కరోనా నిర్ధరణ కాగా... విద్యార్థులు అందరికీ పరీక్షలు చేయించింది యాజమాన్యం.

సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ చేతన్​ దేవరా​, ఎస్పీ హాస్టల్​కు వెళ్లారు. వైరస్​ సోకిన విద్యార్థులను ఒక భవనంలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెగెటివ్​ వచ్చిన విద్యార్థులను మరో చోటు ఉంచారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.

రాజస్థాన్ ఉదయ్​పుర్​ అంబమాత పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ప్రజ్ఞచక్షు అంధ విద్యాలయంలో కరోనా కలకలం రేపింది. హాస్టల్​లో 28 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అంధుల పాఠశాలలోని ఓ ఉపాధ్యాయురాలికి ఇటీవల కరోనా నిర్ధరణ కాగా... విద్యార్థులు అందరికీ పరీక్షలు చేయించింది యాజమాన్యం.

సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ చేతన్​ దేవరా​, ఎస్పీ హాస్టల్​కు వెళ్లారు. వైరస్​ సోకిన విద్యార్థులను ఒక భవనంలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెగెటివ్​ వచ్చిన విద్యార్థులను మరో చోటు ఉంచారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.

ఇదీ చదవండి : కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.