ETV Bharat / bharat

యూపీలో జికా వైరస్​ కలకలం- మరో 25 కొత్త కేసులు

author img

By

Published : Nov 4, 2021, 5:14 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో జికా వైరస్(Zika Virus In Kanpur)​ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. బుధవారం కొత్తగా 25 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 36కు చేరింది.

Zika virus in Kanpur
కాన్పుర్​లో జికా కేసులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జికా వైరస్‌(Zika Virus In Kanpur) చాపకింద నీరులా వ్యాపిస్తోంది. బుధవారం కొత్తగా ఆరుగురు వాయుసేన సిబ్బంది సహా 25 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. దీంతో కాన్పుర్​లో వైరస్​ బాధితుల సంఖ్య 36కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 14 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఆదివారం 586 మంది నమూనాలను సేకరించినట్లు కాన్పుర్ జిల్లా మేజిస్ట్రేట్(డీఎం)​ జి.విశాఖ్​​ తెలిపారు. వాటిని లఖ్​నవూలోని కేజీఎంయూకు పరీక్షల కోసం పంపించినట్లు చెప్పారు. అందులో 25 మందికి జికా వైరస్(Zika Virus In Kanpur)​ నిర్ధరణ అయిందని పేర్కొన్నారు.

ఇంటింటికీ వెళ్లి పరీక్షలు

వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి జిల్లా యంత్రాంగం కృషిచేస్తోందని అధికారులు తెలిపారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం 150 బృందాలతో శానిటేషన్‌, ఫాగింగ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

జికా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో స్థానికులెవరూ భయాందోళనకు గురి కావద్దని డీఎం విశాఖ సూచించారు. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాయుసేన సిబ్బందికి జికా(Zika Virus In Kanpur) సోకిన నేపథ్యంలో.. ఐఏఎఫ్​ స్థావరం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు మరో అధికారి తెలిపారు.

ఏమిటీ జికా వైరస్‌?

జికా వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్‌ కోతిలో గుర్తించారు. ఈ వ్యాధి 1954లో నైజీరియాలో బయటపడింది. అనేక ఆఫ్రికన్‌ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. జికా వైరస్‌ 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ రకం దోమలు వాహకాలుగా పనిచేస్తాయి.

ఇదీ చూడండి: జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జికా వైరస్‌(Zika Virus In Kanpur) చాపకింద నీరులా వ్యాపిస్తోంది. బుధవారం కొత్తగా ఆరుగురు వాయుసేన సిబ్బంది సహా 25 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. దీంతో కాన్పుర్​లో వైరస్​ బాధితుల సంఖ్య 36కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 14 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఆదివారం 586 మంది నమూనాలను సేకరించినట్లు కాన్పుర్ జిల్లా మేజిస్ట్రేట్(డీఎం)​ జి.విశాఖ్​​ తెలిపారు. వాటిని లఖ్​నవూలోని కేజీఎంయూకు పరీక్షల కోసం పంపించినట్లు చెప్పారు. అందులో 25 మందికి జికా వైరస్(Zika Virus In Kanpur)​ నిర్ధరణ అయిందని పేర్కొన్నారు.

ఇంటింటికీ వెళ్లి పరీక్షలు

వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి జిల్లా యంత్రాంగం కృషిచేస్తోందని అధికారులు తెలిపారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం 150 బృందాలతో శానిటేషన్‌, ఫాగింగ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

జికా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో స్థానికులెవరూ భయాందోళనకు గురి కావద్దని డీఎం విశాఖ సూచించారు. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాయుసేన సిబ్బందికి జికా(Zika Virus In Kanpur) సోకిన నేపథ్యంలో.. ఐఏఎఫ్​ స్థావరం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు మరో అధికారి తెలిపారు.

ఏమిటీ జికా వైరస్‌?

జికా వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్‌ కోతిలో గుర్తించారు. ఈ వ్యాధి 1954లో నైజీరియాలో బయటపడింది. అనేక ఆఫ్రికన్‌ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. జికా వైరస్‌ 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ రకం దోమలు వాహకాలుగా పనిచేస్తాయి.

ఇదీ చూడండి: జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.