బంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ జరుగుతున్న వేళ.. బాంబులు కలకలం రేపాయి. బీర్భూమ్ జిల్లా, నానూర్లోని ఓ కమ్యూనిటీ హాల్లో.. శుక్రవారం 200 నాటు బాంబులు బయటపడ్డాయి. బాంబులతో పాటు వాటి తయారీకి అవసరమైన పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
![Bombs recovered from government community hall of Nanur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wb-brmh-01-nanoorhatserandivillagebombrecover-7203424_10042021073511_1004f_1618020311_716_1004newsroom_1618024930_216.jpg)
అనంతరం.. సీఐడీ బాంబ్ స్క్వాడ్ బృందం.. ఊరి చివర్లోని బహిరంగ ప్రదేశంలో ఆ బాంబులను నిర్వీర్యం చేసింది.
అయితే.. బాంబులు బయటపడిన ఆ కమ్యూనిటీ హాల్.. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్ నివాస ప్రాంతంలోనే ఉండటం గమనార్హం.
ఇదీ చదవండి: 200 ఏళ్లుగా చెక్కుచెదరలేదు.. పెచ్చు ఊడలేదు!