ETV Bharat / bharat

ఆ ఆస్పత్రిలో మరో 15 మంది కొవిడ్​ రోగులు మృతి - గోవాలో విషాదం

గోవాలో మరో విషాదం జరిగింది. గోవా వైద్య కళాశాల, ఆస్పత్రిలో 15 మంది కొవిడ్​ రోగులు మృతి చెందారు.

Goa hospital
గోవాలో కొవిడ్​ రోగులు మృతి
author img

By

Published : May 13, 2021, 8:18 PM IST

Updated : May 13, 2021, 8:43 PM IST

గోవా వైద్య కళాశాల ఆస్పత్రిలో మరో విషాదం జరిగింది. మరో 15 మంది కొవిడ్​ రోగులు.. గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు బొంబాయి హైకోర్టుకు గోవా ప్రభుత్వం తెలిపింది. రెండు రోజుల క్రితం ఇదే ఆస్పత్రిలో 4 గంటల వ్యవధిలో 26 మంది కరోనా రోగులు మృతి చెందటం గమనార్హం.

ఆస్పత్రిలో ఆక్సిజన్​ సిలిండర్లలో సమస్యలు తలెత్తడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలిపినట్లు బొంబాయి హైకోర్టులోని గోవా బెంచ్​ చెప్పింది. ఆస్పత్రిలో ఆక్సిజన్​ సదుపాయం ఏర్పాటు చేయాలని తాము ఇదివరకే ఆదేశించినప్పటికీ.. గురువారం ఉదయం 2 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని పేర్కొంది.

ఆస్పత్రిలో ఆక్సిజన్​ సరఫరా అందకే రెండు రోజుల క్రితం.. కొవిడ్​ రోగులు మృతి చెందారనే ఫిర్యాదులపై హైకోర్టు విచారణ చేపట్టింది. గోవాలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నందున.. రాష్ట్రానికి కేటాయించిన కోటాను త్వరగా చేరుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రతి రోగికి మెడికల్​ ఆక్సిజన్​ అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి: వ్యాక్సినేషన్​కు కొత్త రూల్స్- మీరూ తెలుసుకోండి!

గోవా వైద్య కళాశాల ఆస్పత్రిలో మరో విషాదం జరిగింది. మరో 15 మంది కొవిడ్​ రోగులు.. గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు బొంబాయి హైకోర్టుకు గోవా ప్రభుత్వం తెలిపింది. రెండు రోజుల క్రితం ఇదే ఆస్పత్రిలో 4 గంటల వ్యవధిలో 26 మంది కరోనా రోగులు మృతి చెందటం గమనార్హం.

ఆస్పత్రిలో ఆక్సిజన్​ సిలిండర్లలో సమస్యలు తలెత్తడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలిపినట్లు బొంబాయి హైకోర్టులోని గోవా బెంచ్​ చెప్పింది. ఆస్పత్రిలో ఆక్సిజన్​ సదుపాయం ఏర్పాటు చేయాలని తాము ఇదివరకే ఆదేశించినప్పటికీ.. గురువారం ఉదయం 2 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని పేర్కొంది.

ఆస్పత్రిలో ఆక్సిజన్​ సరఫరా అందకే రెండు రోజుల క్రితం.. కొవిడ్​ రోగులు మృతి చెందారనే ఫిర్యాదులపై హైకోర్టు విచారణ చేపట్టింది. గోవాలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నందున.. రాష్ట్రానికి కేటాయించిన కోటాను త్వరగా చేరుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రతి రోగికి మెడికల్​ ఆక్సిజన్​ అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చూడండి: వ్యాక్సినేషన్​కు కొత్త రూల్స్- మీరూ తెలుసుకోండి!

Last Updated : May 13, 2021, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.