తన వయస్సు కేవలం 13ఏళ్లే.. అయితేనేం కలం పట్టిందంటే కళ్లముందు కదలాడేలా కథలు రాస్తుంది. దీనికితోడు కుంచే అందుకుందంటే బొమ్మ అదిరిపోవాల్సిందే. రాజస్థాన్ అజ్మేర్లోనే.. అతి చిన్న వయస్సులో రచయితగా గుర్తింపుపొందిన ఆ బాలిక.. ఇప్పుడు తన పెయింటింగ్స్తోనూ ప్రశంసలు పొందుతోంది.
కాన్వాస్ పెయింటింగ్స్తో ఇప్పుడు అందరినీ అబ్బురపరుస్తోన్న బాలిక పేరు అదితి కల్యాణి. ఆమె గీసే చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. 1940లోని భారత సినీ నటీమణుల చిత్రాల్ని క్యాన్వస్పై గీసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అబ్బుర పరిచే ఆ చిత్రాలతో తాను మల్టీ టాలెంటెడ్ అని చాటుకుంటోంది.
ఆ పెయింటింగ్స్ మాత్రమే కావు..
తన పెయింటింగ్స్లో ఉన్న విశేషమేమిటంటే.. నాటి నటీమణులు ఎలా ఉండే వారు, సినీ రంగంలో వారు అడుగు పెట్టడానికి ముందు ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నారు? అనే విషయాలు అందులో ప్రతిబింబిస్తాయి.
గత మూడేళ్లుగా అదితి.. కాన్వాస్ పెయింటింగ్స్ను వేస్తోంది. ప్రదర్శనలో ఉన్న ఆమె పెయింటింగ్స్ను పలువురు సందర్శిస్తున్నారు.
ఈ సందర్భంగా ఈటీవీ భారత్తో అదితి ముచ్చటించారు.
"1950లోని నటీమణులు.. సినిమాలోకి అడుగుపెట్టే ముందు వారికి స్వేచ్ఛ లేదు. నాలుగు గోడల మధ్య వారిని బందీగా ఉంచి విద్యావకాశాలకు దూరం చేశారు. ఈ పెయింటింగ్స్ అప్పటి నటీమణుల కష్టాల్ని, నటనకోసం వారు పడ్డ తపనని తెలియజేస్తాయి. అప్పటి నటీమణులు చాలా కష్టాలను ఎదుర్కొని సినిమారంగంలో రాణించారు. ఉదాహరణకు నూర్జహాన్, దర్శకురాలిగా,నిర్మాతగా గాయనిగా రాణించారు. అలాంటి వారిగురించి తెలియజేయడానికే వారి చిత్రాల్ని గీశాను. 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ పెయింటింగ్స్లోని నటీమణుల్ని గుర్తించగలరు. ఈ తరం వారికి వారేవరో తెలియదు. అందుకే వారి గురించి తెలియజేయడానికే ఈ పెయింటింగ్స్ వేశాను."
-అదితి కల్యాణి, పెయింటర్
1950 నాటి నటీమణులైన సూరియా, రేష్మా, శ్యామ, సంధ్య, షకీలా, నిమ్మి మొదలైన వారి చిత్రాల్ని అదితి గీసింది. ఈ ప్రదర్శన కొత్త అనుభూతినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
రచయితగా..
2017లో అడ్వెంచర్ ఆఫ్ తుబి అండ్ హర్ ఫ్రెండ్స్ పుస్తకం రాసినందుకు ఎన్నో అవార్డుల్ని అందుకుంది అదితి కల్యాణి. ఆ పుస్తకంలో 11 చిన్న కథల్ని 9000 పదాలతో రాసింది. ఆ కథలేకాదు వాటిలోని బొమ్మలూ మనల్ని ఆకట్టుకుంటాయి.
ఇదీ చూడండి: కుమారుడి మరణం.. పోసింది ఆరోగ్య కేంద్రానికి ప్రాణం!