ETV Bharat / bharat

యూపీలో జికా విజృంభణ.. మరో 13 కొత్త కేసులు

author img

By

Published : Nov 6, 2021, 5:08 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో జికా వైరస్(Zika Virus In Kanpur) ​వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. శనివారం కొత్తగా 13మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 79కు చేరింది.

zika cases
జికా విజృంభణ

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో జికా(Zika Virus In Kanpur) వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. శనివారం కొత్తగా 13మంది వైరస్​ బారిన పడ్డారు. దీంతో కాన్పుర్​లో జికా వైరస్​ బాధితుల సంఖ్య 79కి చేరింది.

ఉత్తర్​ప్రదేశ్​లో జికావ్యాప్తి నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైనట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దు రాష్ట్రం అయినందు వల్ల.. వైరస్ వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

ఇంటింటికీ వెళ్లి పరీక్షలు

వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి కాన్పుర్​ జిల్లా యంత్రాంగం కృషిచేస్తోందని అధికారులు తెలిపారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జికా(Zika Virus In Kanpur) లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం 150 బృందాలతో శానిటైజేషన్‌, ఫాగింగ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జికా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో స్థానికులెవరూ భయాందోళనకు గురి కావద్దని డీఎం విశాఖ సూచించారు. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాయుసేన సిబ్బందికి జికా(Zika Virus In Kanpur) సోకిన నేపథ్యంలో.. ఐఏఎఫ్​ స్థావరం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు మరో అధికారి తెలిపారు.

ఏమిటీ జికా వైరస్‌?

జికా వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్‌ కోతిలో గుర్తించారు. ఈ వ్యాధి 1954లో నైజీరియాలో బయటపడింది. అనేక ఆఫ్రికన్‌ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. జికా వైరస్‌ 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ రకం దోమలు వాహకాలుగా పనిచేస్తాయి.

ఇదీ చూడండి: బైక్​ను ఢీకొన్న రైలు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో జికా(Zika Virus In Kanpur) వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. శనివారం కొత్తగా 13మంది వైరస్​ బారిన పడ్డారు. దీంతో కాన్పుర్​లో జికా వైరస్​ బాధితుల సంఖ్య 79కి చేరింది.

ఉత్తర్​ప్రదేశ్​లో జికావ్యాప్తి నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైనట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దు రాష్ట్రం అయినందు వల్ల.. వైరస్ వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

ఇంటింటికీ వెళ్లి పరీక్షలు

వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి కాన్పుర్​ జిల్లా యంత్రాంగం కృషిచేస్తోందని అధికారులు తెలిపారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జికా(Zika Virus In Kanpur) లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం 150 బృందాలతో శానిటైజేషన్‌, ఫాగింగ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జికా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో స్థానికులెవరూ భయాందోళనకు గురి కావద్దని డీఎం విశాఖ సూచించారు. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాయుసేన సిబ్బందికి జికా(Zika Virus In Kanpur) సోకిన నేపథ్యంలో.. ఐఏఎఫ్​ స్థావరం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు మరో అధికారి తెలిపారు.

ఏమిటీ జికా వైరస్‌?

జికా వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్‌ కోతిలో గుర్తించారు. ఈ వ్యాధి 1954లో నైజీరియాలో బయటపడింది. అనేక ఆఫ్రికన్‌ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. జికా వైరస్‌ 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ రకం దోమలు వాహకాలుగా పనిచేస్తాయి.

ఇదీ చూడండి: బైక్​ను ఢీకొన్న రైలు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.