హిమాచల్ ప్రదేశ్లో కరోనా మహమ్మారి కలవరాని గురి చేస్తోంది. ధర్మశాలలోని గ్యుటో ఆశ్రమంలో సోమవారం ఒక్క రోజే 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది.
కంటైన్మెంట్ జోన్గా..
గ్యుటో ఆశ్రమ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించినట్లు కాంగ్రా జిల్లా ముఖ్య వైద్యాధికారి డా.దర్శన్ గుప్తా తెలిపారు. ఈ ఆశ్రమంలో ఇప్పటివరకు మొత్తం 156 బౌద్ధ సన్యాసులకు కొవిడ్ సోకినట్లు చెప్పారు. ఆశ్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు ఎలా నమోదయ్యాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
హిమాచల్ప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు.. కొన్ని ప్రాంతాల్లో వైరస్ కట్టడి చర్యలను కఠినతరం చేశారు.