ETV Bharat / bharat

100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా - ధర్మశాలలో కరోనా

హిమాచల్​ ప్రదేశ్​ ధర్మశాలలోని ఓ బౌద్ధ ఆశ్రమంలో ఒక్కరోజే 100 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్​గా తేెలింది. ఇప్పటివరకు ఆ ఆశ్రమంలో 156 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్​మెంట్​​ జోన్​గా ప్రకటించారు.

100 monk found corona positive in dharamshala
ఒక్కరోజే 100 మంది సన్యాసులకు కరోనా
author img

By

Published : Mar 1, 2021, 11:36 PM IST

హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కలవరాని గురి చేస్తోంది. ధర్మశాలలోని గ్యుటో ఆశ్రమంలో సోమవారం ఒక్క రోజే 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

కంటైన్​‌మెంట్ జోన్‌గా..

గ్యుటో ఆశ్రమ ప్రాంతాన్ని కంటైన్​మెంట్​ జోన్​గా ప్రకటించినట్లు కాంగ్రా జిల్లా ముఖ్య వైద్యాధికారి డా.దర్శన్​ గుప్తా తెలిపారు. ఈ ఆశ్రమంలో ఇప్పటివరకు మొత్తం 156 బౌద్ధ సన్యాసులకు కొవిడ్​ సోకినట్లు చెప్పారు. ఆశ్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు ఎలా నమోదయ్యాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

హిమాచల్​ప్రదేశ్​లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు.. కొన్ని ప్రాంతాల్లో వైరస్​ కట్టడి చర్యలను కఠినతరం చేశారు.

ఇదీ చూడండి:'కరోనా టీకా తీసుకోం- వ్యాక్సినేషన్​ అడ్డుకోం'

హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కలవరాని గురి చేస్తోంది. ధర్మశాలలోని గ్యుటో ఆశ్రమంలో సోమవారం ఒక్క రోజే 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

కంటైన్​‌మెంట్ జోన్‌గా..

గ్యుటో ఆశ్రమ ప్రాంతాన్ని కంటైన్​మెంట్​ జోన్​గా ప్రకటించినట్లు కాంగ్రా జిల్లా ముఖ్య వైద్యాధికారి డా.దర్శన్​ గుప్తా తెలిపారు. ఈ ఆశ్రమంలో ఇప్పటివరకు మొత్తం 156 బౌద్ధ సన్యాసులకు కొవిడ్​ సోకినట్లు చెప్పారు. ఆశ్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు ఎలా నమోదయ్యాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

హిమాచల్​ప్రదేశ్​లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు.. కొన్ని ప్రాంతాల్లో వైరస్​ కట్టడి చర్యలను కఠినతరం చేశారు.

ఇదీ చూడండి:'కరోనా టీకా తీసుకోం- వ్యాక్సినేషన్​ అడ్డుకోం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.