ETV Bharat / bharat

దేశంలో 1.08 కోట్ల టీకా డోసుల పంపిణీ

దేశంలో మొత్తం 1.08 కోట్ల కరోనా టీకా డోసులు అందించినట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మన్‌దీప్ భండారి వెల్లడించారు.

author img

By

Published : Feb 20, 2021, 10:17 PM IST

1.08 crore COVID-19 vaccine doses administered: Govt
కరోనా టీకా

దేశంలో ఇప్పటివరకూ మొత్తం 1.08 కోట్ల కరోనా టీకా డోసులు అందించినట్టు కేంద్రం ప్రకటించింది. టీకా పంపిణీ పురోగతిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మన్‌దీప్ భండారి దిల్లీలో వెల్లడించారు. శనివారం ఒక్కరోజు.. సాయంత్రం 6 గంటల వరకు 1,86,081 టీకాలు పంపిణీ చేసినట్టు తెలిపారు.

ఇవీ లెక్కలు..

1,08,38,323 డోసుల్లో.. ఆరోగ్య సిబ్బందికి 72,26,653 డోసులివ్వగా.. పారిశుద్ధ్య కార్మికులకు 36,11,670 డోసుల పంపిణీ జరిగింది. ఇక 70,52,845 డోసుల్లో.. ఆరోగ్య కార్యకర్తలకు 63,52,713 డోసులు(మొదటి) ఇవ్వగా.. 8,73,940 మందికి రెండవ డోసు పంపిణీ జరిగింది.

''ఈ రోజు వరకు టీకాల కారణంగా రోగనిరోధక శక్తి క్షీణత, తీవ్రమైన అనారోగ్యం, మరణం వంటి సంఘటనలేమీ నమోదు కాలేదు.''

-మన్‌దీప్ భండారి, కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శి

టీకా ప్రతికూలత సాధారణమే..

ఇక టీకా తీసుకున్న వారిలో ఇప్పటివరకు 43 మంది అస్వస్థతకు గురయ్యారని భండారి వెల్లడించారు. వీరిలో 26 మంది కోలుకోగా.. 16 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. మరొకరు చికిత్స పొందుతున్నారని వివరించారు. అయితే.. కరోనా టీకా కారణంగా కేవలం 0.0004 మందిపై మాత్రమే ప్రతికూల ప్రభావం పడిందన్నారు.

మొత్తం టీకా లబ్ధిదారుల్లో 0.0003శాతం (37) మరణాలు నమోదయ్యాయని తెలిపారు. వీరిలో 16మంది ఆసుపత్రుల్లో మరణించారు. మరో 21 మరణాలు ఆసుపత్రుల వెలుపల నమోదయ్యాయి.

ఇదీ చదవండి: 'భారతీయ టీకా సురక్షితం- కోటి మందికిపైగా వ్యాక్సినేషన్​'

దేశంలో ఇప్పటివరకూ మొత్తం 1.08 కోట్ల కరోనా టీకా డోసులు అందించినట్టు కేంద్రం ప్రకటించింది. టీకా పంపిణీ పురోగతిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మన్‌దీప్ భండారి దిల్లీలో వెల్లడించారు. శనివారం ఒక్కరోజు.. సాయంత్రం 6 గంటల వరకు 1,86,081 టీకాలు పంపిణీ చేసినట్టు తెలిపారు.

ఇవీ లెక్కలు..

1,08,38,323 డోసుల్లో.. ఆరోగ్య సిబ్బందికి 72,26,653 డోసులివ్వగా.. పారిశుద్ధ్య కార్మికులకు 36,11,670 డోసుల పంపిణీ జరిగింది. ఇక 70,52,845 డోసుల్లో.. ఆరోగ్య కార్యకర్తలకు 63,52,713 డోసులు(మొదటి) ఇవ్వగా.. 8,73,940 మందికి రెండవ డోసు పంపిణీ జరిగింది.

''ఈ రోజు వరకు టీకాల కారణంగా రోగనిరోధక శక్తి క్షీణత, తీవ్రమైన అనారోగ్యం, మరణం వంటి సంఘటనలేమీ నమోదు కాలేదు.''

-మన్‌దీప్ భండారి, కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శి

టీకా ప్రతికూలత సాధారణమే..

ఇక టీకా తీసుకున్న వారిలో ఇప్పటివరకు 43 మంది అస్వస్థతకు గురయ్యారని భండారి వెల్లడించారు. వీరిలో 26 మంది కోలుకోగా.. 16 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. మరొకరు చికిత్స పొందుతున్నారని వివరించారు. అయితే.. కరోనా టీకా కారణంగా కేవలం 0.0004 మందిపై మాత్రమే ప్రతికూల ప్రభావం పడిందన్నారు.

మొత్తం టీకా లబ్ధిదారుల్లో 0.0003శాతం (37) మరణాలు నమోదయ్యాయని తెలిపారు. వీరిలో 16మంది ఆసుపత్రుల్లో మరణించారు. మరో 21 మరణాలు ఆసుపత్రుల వెలుపల నమోదయ్యాయి.

ఇదీ చదవండి: 'భారతీయ టీకా సురక్షితం- కోటి మందికిపైగా వ్యాక్సినేషన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.