![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8623801-889-8623801-1598859117970.jpg)
విశాఖ గోపాలపట్నం వద్ద కుమారి కళ్యాణ మండపం సమీపంలో ప్రధాన రహదారిపై నలుగురు ప్రయాణిస్తున్న కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన ప్రయాణికులు నలుగురు దూరంగా పారిపోయారు. కారు చూస్తుండగానే కాలిపోయింది. ప్రయాణికులకు ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.