ప్రకృతి సోయగం చూడ తరమా.... - visakha update news
🎬 Watch Now: Feature Video

విశాఖ జిల్లా పాడేరు మన్యం అంటేనే ప్రకృతి అందాలకు నిలయం. అందులోనూ శీతాకాలం సందర్భంగా... ఆ సోయగాలు మరింత కనువిందు చేస్తున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో రహదారికి ఇరువైపులా పసుపు వర్ణంలో తళుకులీనే వలిస పూల సోయగం కట్టిపడేస్తుంది. విశాఖ ఏజెన్సీలో అద్భుతమైన పూల మైదానాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.