YCP Activists Dissatisfaction: వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్లకు వైసీపీ నేతలు ఝలక్ - వైఎస్సార్సీపీ నేత అసంతృప్తి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-07-2023/640-480-18949844-150-18949844-1688829129330.jpg)
YSRCP Leader Dissatisfaction: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెంలో వైఎస్సార్ జయంతి ఉత్సవాలలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ ముందే వైసీపీ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, అయితే, అందుకు విరుద్దంగా పరిస్థితి ఉందని వైసీపీ నేతలు వాపోయారు. పరిశ్రమలకు భూములిచ్చిన నిర్వాసితులకు ఉపాధి దక్కలేదని.. వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ ముందే కుండబద్దలు కొట్టారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెంలో నిర్వహించిన వైఎస్సార్ జయంత్యుత్సవాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్వాసితుల సమస్యలపై గవర కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ ప్రసాద్ గళమెత్తారు. పరిశ్రమలకు భూములిచ్చి సర్వం కోల్పోయామని.. ఆవేదన వ్యక్తం చేశారు. పక్క జిల్లాల వాసులకు కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తూ స్థానికులకు మొండిచేయి చూపిస్తున్నారని ఆక్షేపించారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విన్నవించారు. నిర్వాసితులకు తాగునీరు లేదని.. కాలనీలో మౌలిక వసతుల్లేవని గోడు వెల్లబోసుకున్నారు.