thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 9:06 PM IST

ETV Bharat / Videos

Woman Suicide Attempt in Eluru Collectorate: ఏలూరు జిల్లా కలెక్టరేట్​లో మహిళ ఆత్మహత్యాయత్నం.. తనకు చావే దిక్కంటూ అవేదన

Woman Suicide Attempt in Eluru District Collectorate: తన సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవటం లేదని.. ఏలూరు జిల్లా కలెక్టరేట్​లో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడున్న వారు గమనించి ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని.. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావటం లేదనే ఈ చర్యకు పాల్పడినట్లు సదరు మహిళ తెలిపారు.

 మండవల్లి మండలం దెయ్యంపాలెం గ్రామంలో సైదు బేబీ కుమారి అనే మహిళ నివాసం ఉంటోంది. తన తండ్రి నుంచి సంక్రమించిన 56 సెంట్ల భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమించుకున్నారని ఆమె ఆరోపించింది. భూమిని అక్రమించుకున్న వారితో రెవెన్యూ అధికారులు కూడా చేతులు కలిపి తనకు అన్యాయం చేస్తున్నారని వాపోయింది. ఇదే అంశంపై తాను పలుమార్లు కలెక్టర్​ కార్యాలయంలోని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశానని.. అయినా అధికారులు స్పందించటం లేదని వివరించింది. అధికారులు స్పందించకపోవటంతో మనస్థాపనికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆమె వివరించారు. ఇప్పటికైనా తన సమస్యను అధికారులు పరిష్కరించకపోతే మరణమే దిక్కని ఆవేదనకు లోనయ్యింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.