జేసీ డెడ్​లైన్​ - ఎట్టకేలకు ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 3:35 PM IST

thumbnail

Uyyalawada Narasimha Reddy Statue Unveiled by Reddy Community Leaders : అనంతపురం నగరంలో మొదటి నుంచి వివాదాస్పదంగా మారిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి విగ్రహాన్ని ఎట్టకేలకు ఆవిష్కరించారు. గత ఆదివారం విగ్రహావిష్కరణకు యత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో వైసీపీ ఎమ్మెల్యే హస్తం ఉందంటూ సోషల్​ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

Uyyalawada statue Opening : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఆవిష్కరించడంలో జరిగిన జాప్యంపై తెలుగు దేశం నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​ రెడ్డి బుధవారం స్పందించారు. విగ్రహావిష్కరణకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే తానే ఆవిష్కరిస్తానని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ రెడ్డి సంఘం నాయకులు ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇబ్బందులన్నీ అధిగమించి విగ్రహాన్ని ఆవిష్కరించామని రెడ్డి సంఘం అధ్యక్షుడు నరేష్​ కుమార్​ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా ఉయ్యాలవాడ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసేలా బోర్డు వేయిస్తామని వెల్లడించారు. ఇందుకు సహకరించిన నాయకులకు, రెడ్డి సంఘం సభ్యులకు కృతజ్ఞత తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.