రెండు ఆర్టీసీ బస్సులు ఢీ - తప్పిన పెను ప్రమాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 1:30 PM IST

thumbnail

Two RTC Buses Collided in Paderu Ghat Road : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఆర్టీసీ సిబ్బంది స్వల్ప గాయలతో బయటపడ్డారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణానష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. గురువారం ఉదయం అనకాపల్లి నుంచి పాడేరు వచ్చే బస్సు, అలాగే పాడేరు నుంచి వైజాగ్ వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ ప్రమాదానికి గురయ్యాయి. పాడేరు ఘాట్ రోడ్డు​లోని సమీప మలుపులో రెండు బస్సులు ఓకేసారి ఎదురుపడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Road Accident in Alluri District : దీంతో బస్సుల ముందు భాగాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘాట్ రోడ్డుకి ఇరువైపులా లోయలు ఉన్నాయి. బస్సులు అదుపుతప్పి లోయలో పడిఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని ప్రయాణికులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఘాట్​ రోడ్డుపై భారీగా వాహనాలు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఎదురుచూస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.