TDP Pattabhi Fire on Undavalli Arun : ఉండవల్లికి మద్యం, ఇసుక కుంభకోణాలు కనిపించడం లేదా..? : టీడీపీ నేత పట్టాభి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2023, 6:27 PM IST

thumbnail

TDP Pattabhi Fire on Undavalli Arun : చంద్రబాబును అరెస్టు చేసి జగన్ తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. రాజకీయ సమాధికి పునాది వేసుకున్న జగన్.. ఎన్ని మందులు వేసుకున్నా జ్వరం తగ్గదు అని పేర్కొన్నారు. స్కిల్ కేసులో ఉండవల్లి అరుణ్‌కుమార్ (Undavalli Arun Kumar) సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉండవల్లికి నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న వైసీపీ అవినీతి, జగన్ దోపిడీ కనిపించట్లేదా అని ప్రశ్నించారు. కుంభకోణాలపై ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరలేదని నిలదీశారు. ఎవరో తయారుచేసిన పిటిషన్‌పై సంతకం చేశారన్న పట్టాభి... ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లం పేర్లు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. 

చంద్రబాబు నాయుడు ఏ తప్పూ చేయకున్నా.. ప్రజల తరఫున ఆయన పోరాడుతున్నాడనే ఉక్రోషంతోనే అరెస్టు చేశారన్న నిజాన్ని ప్రజలంతా తెలుసుకున్నారు. వైసీపీ నేతలు (YSRCP Leaders) ఎన్ని కుప్పిగంతులు వేసినా కూడా ప్రజలు విశ్వసించరు. స్వయం ప్రకటిత మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ చూస్తుంటే నవ్వొస్తోంది. కొన్ని వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం కనిపించడం లేదా..? ఎవరో తయారు చేసిన పిటిషన్ పై సంతకం చేశారా.. కార్పొరేషన్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నీలం సహాని, అజేయ కల్లం పేర్లు ఎందుకు చేర్చలేదు..? అని పట్టాభి దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.