thumbnail

అక్రమ మైనింగ్​ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు - 'వైసీపీ నాయకులకు అధికారులు కొమ్ముకాస్తున్నారు'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 1:22 PM IST

TDP Leaders Protest to Stop Illegal Mining In Nellore District : నెల్లూరు జిల్లా  సైదాపురం మండలంలో తెలుగుదేశం నేతలు (TDP Leaders) అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్నారు. నెల రోజులుగా రిజర్వ్ ఫారెస్ట్ అసైన్మెంట్ భూముల్లో అక్రమ తవ్వకాలు (Mining) చేస్తున్నారని మండిపడ్డారు. హిటాచీ, జెసీబీలను ఎమ్మెల్యే (MLA) కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అడ్డుకున్నారు.పేదలు సాగు చేసుకునే భూములు నాశనం చేస్తున్నారని నిరసనకు దిగారు.

MLA Kotam Reddy Protest : అధికారులు వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో ఉన్న కొందరు ఆపరేటర్లు తమను చూసి వాహనాలను వదిలి పారిపోయారని కోటం రెడ్జి తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైదాపురం తాహసీల్దార్‌కు ఫోన్ చేసిఅక్రమ మైనింగ్​ గురించి ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నారని, తమకు ఏ ఆదేశాలు వచ్చాయో చూపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.