Sarcastic Flexes on AP Roads in Narsipatnam : 'ఇది జగనన్న గొయ్యి.. కాస్త చూసుకొని వెళ్లండి' రోడ్ల దుస్థితిపై ఫ్లెక్సీలు - నర్సీపట్నం వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-09-2023/640-480-19576557-thumbnail-16x9-roads.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 12:47 PM IST
Sarcastic Flexes on AP Roads in Narsipatnam : అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నుంచి కృష్టదేవి పేటకు వెళ్లే రహదారి దుస్థితిపై వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నర్సీపట్నానికి చెందిన పౌర సేవా సంఘం పేరుతో రహదారి మధ్యలో ఉన్న గుంతలు వాహనదారులకు తెలిసేలా.. వారికి చూపించే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాహనదారులను ఆలోచింపజేస్తున్నారు.
రహదారి మధ్యలో ఉన్న గుంతలను వాహనదారులకు చూపించి.. వారిని అప్రమత్తం చేయటంతో పాటు.. జగనన్న రహదారి చూసుకుని ప్రయాణించండి అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం పట్టణంలో చర్యనీయాంశమైంది. 'ఇది జగనన్న గొయ్యి.. కాస్త చూసుకొని వెళ్లండి జాగ్రత్తగా' అని వ్యంగ్యంగా హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని ప్రభుత్వం తక్షణమే బాగు చేయాలంటూ వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలోనూ రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యగా చిత్రాలు, వీడియోలు, వ్యాఖ్యనాలు వెల్లువెత్తాయి. ఎన్ని సార్లు అధికారులకు రోడ్ల గురించి ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.