thumbnail

ఘనంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి కలశ జ్యోతుల ఊరేగింపు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 10:08 PM IST

Pydithalli Ammavari Kalasa Jyothi Mahotsavam: ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి నెలరోజుల ఉత్సవాల్లో భాగంగా కలశ జ్యోతుల ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముందుగా అమ్మవారికి పంచామృతాలతో , అర్చనల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రైల్వేస్టేషన్ సమీపంలోని వనంగుడి నుంచి కలశ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడి నుంచి అలంకరించిన అమ్మవారి విగ్రహాన్ని సీఎంఆర్, ఎన్​సీఎస్, డాబా గార్డెన్స్, కన్యాకాపరమేశ్వరి ఆలయం, గంట స్తంభం మీదుగా మూడు లాంతర్ల వద్ద గల చదురుగుడి వరకు ఊరేగించారు. మాలదారులు కలశ జ్యోతులతో అమ్మవారి విగ్రహం వెంట రాగా.. కళాకారులు పలు కళారూపాలను ప్రదర్శించారు. 

భక్తుల కోలహలంతో అక్కడి ప్రాంతమంతా.. భక్తి పరవశంలో మునిగిపోయింది. జై పైడిమాంబ.. జైజై పైడితల్లి అంటు మాలదారులు వెంటరాగ.. భజన, కోలాట ప్రదర్శనతో అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో సుధారాణి, సిరిమానోత్సవ అధిరోహిత పూజారి వెంకటరావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ప్రతియేటా జరుగుతుందన్నారు. దీపావళి పర్వదినం ముందుగా చీకటిని పారద్రొలి వెలుగులు నింపే ప్రతీకగా ఈ కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.