thumbnail

PRATHIDWANI కొత్త పన్నుల భారంతో ప్రజల జీవనం సాఫీగా సాగుతుందా

By

Published : Aug 16, 2022, 9:06 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నులు విధించే మార్గాన్నే ఎంచుకుంటోంది. ఇప్పటికే చెత్తపన్ను, ట్రూ ఆప్‌ ఛార్జీల రూపంలో ప్రజల నుండి భారీగా పన్నులు రాబట్టింది. ఈ అనుభవంతో ఇప్పుడు ఇంపాక్ట్‌ ఫీజుల పేరుతో కొత్త ఆదాయ మార్గం కనిపెట్టింది. రహదారులకు ఇరువైపులా నిర్మించే భవనాలు, నివాసాలపై పన్నులు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై ఎన్ని రకాల పన్నులు విధిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త పన్నులతో ప్రజలపై భారాలు మోపితే వారి జీవనం సాఫీగా సాగుతుందా. ప్రభుత్వం వేస్తున్న పన్నులను ప్రజలు నోరెత్తకుండా చెల్లించాల్సిందేనా. ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.