రుషికొండపై సీఎం జగన్ కట్టించిన నిర్మాణాలు కూల్చేయాలని కోర్టులు చెబితే ఆ నష్టం ఎవరు భరించాలి? - ప్రతిధ్వని కార్యక్రమం
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2023, 9:59 PM IST
Prathidhwani: అమరావతిలో ప్రజావేదిక అనే అధునాతన భవనం ఉండేది. నాడు ప్రజలు నేరుగా ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకోవటానికి అక్కడికి వచ్చేవారు. ఆ ప్రజావేదికను నిర్థాక్షిణ్యంగా కూల్చేశారు సీఎం జగన్. పర్యావరణానికి ఆ కట్టడం నష్టం కలిగిస్తోందని నాడు నీతులు చెప్పారు. ఈ రోజు కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్ వంటి రాజ్యాంగ సంస్థల ఆదేశాలకు పాతరేశారు అదే సీఎం జగన్. విశాఖ తీరాన రుషికొండపై రూ.350 కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి విలాసవంతమైన భవంతి కట్టేశారు. గతంలో దేశంలో ఇలాగే పర్యావరణానికి నష్టం కలిగించేలా వందల కోట్లతో నిర్మించిన అనేక కట్టడాలను కోర్టులు కూలగొట్టించాయి. భవిష్యత్తులో రుషికొండపై సీఎం జగన్ కట్టించిన నిర్మాణాలను కూల్చేయాల్సిందిగా కోర్టులు చెబితే ఆ నష్టం ఎవరు భరించాలి? ప్రజాధనానికి నష్టం కలిగించిన నేరానికి ఎన్నేళ్లు ఈ ముఖ్యమంత్రిని ఖైదు చేయాలి? చట్టాల పట్ల గౌరవం లేని సీఎం జగన్ గురించి జనం ఏం అనుకుంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.