అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న రైల్వే పోలీసులు - 64 కిలోలు స్వాధీనం - illegally transporting ganja
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 4:34 PM IST
Illegally Ganja Transporting in Anantapur District : అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి గోవాకు అక్రమ రవాణా చేస్తున్న గంజాయి నిందితులను ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.8.69 లక్షల విలువ చేసే 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ సీఐ నగేశ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒరిస్సాకు చెందిన శిబిరాం ప్రధాన్తో పాటు మరో వ్యక్తి కలిసి ఒరిస్సాలోని బరంపూర్ నుంచి గోవాకు గంజాయిని తీసుకెళ్లడానికి గుంతకల్ రైల్వే స్టేషన్లో దిగారు.
అక్కడి నుంచి గోవా రైలు ఎక్కడానికి చేస్తున్న ప్రయత్నంలో పోలీసులను చూసి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయట పడింది. వీరిలో ఒక వ్యక్తి పట్టుపడగా మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుడు శిబిరాం ప్రధాన్ ఒరిస్సా నుంచి గోవాకు గంజాయి తీసుకెళ్తే అతనికి రూ.15 వేలు ఇస్తారని విచారణలో తెలిందని సీఐ నగేశ్ తెలిపారు.