thumbnail

By

Published : Aug 14, 2023, 8:22 PM IST

ETV Bharat / Videos

Farmers angry on power cuts విద్యుత్ కోతలపై రైతన్నల ఆగ్రహం..సబ్​స్టేషన్ ముందు..!

Farmers angry on power cuts  : శ్రీ సత్యసాయి జిల్లా చిలుమత్తూరు మండలంలోని విద్యుత్ ఉపకేంద్రం ముందు రైతులు  బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మండలంలోని యగ్నిశెట్టిపల్లి గ్రామ రైతులు దేవకేతపల్లి విద్యుత్ ఉపకేంద్రం ఎదుట  తమ నిరసన వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా  త్రీఫేస్ విద్యుత్ సరఫరా సరిగా రావడం లేదని ఆరోపించారు. తరచూ విద్యుత్​ అంతరాయాల పంటలు చేతికి అందవచ్చే సమయానికి తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. నిర్ణిత సమయం అంటూ లేకుండా  విద్యుత్ సరఫరా చేయడంతో  తాము తీవ్ర ఇబ్బందులకు పడాల్సి వస్తోందని రైతులు  వాపోయారు. విద్యుత్ సమస్యలపై  అధికారులకు   పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకోసమే ఆందోళన చేయాల్సి వచ్చిందని యగ్నిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రైతులు వెల్లడించారు. అధికారులు ఇప్పటికైనా విద్యుత్ సమస్యలపై  స్పందించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అంతరాయం లేకుండా  విద్యుత్ సరఫరా చేసి తమ పంటలను కాపడాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పంధించిన విద్యుత్ అధికారులు  నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.