వైసీపీ పాలనపై ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారు: మాజీ మంత్రి నారాయణ - Ex Minister Ponguru Narayana
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2024, 6:53 PM IST
Ex Minister Ponguru Narayana Fires on YSRCP Govt: నెల్లూరు నగర నియోజకవర్గంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ కాలనీల పర్యటనను ముమ్మరం చేశారు. గడప గడప తిరుగుతూ నాలుగున్నరేళ్లలో ప్రజలు పడిన కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఇంటికి వెళ్లి అడిగినా వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని నారాయణ తెలిపారు. గతంలో టీడీపీ చేసిన అభివృద్ధిని గురించి ప్రజలు చెబుతున్నారని చెప్పారు. కనీసం ఈ ప్రభుత్వం కాలనీలలో మురుగు కాలువలు నిర్మాణం కూడా చేయలేదని దుయ్యబట్టారు.
అంగన్వాడీలు సమ్మె బాటలో ఉన్నామని నారాయణకు వివరించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వలనే వారంతా సమ్మె బాట పట్టారని నారాయణ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి పాలన తెలియదని విమర్శించారు. ఆదాయ మార్గాలను గాలికొదిలేసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది చేయకుండా ట్యాక్స్ల పేరుతో ప్రజలపై భారం వేసిందని ధ్వజమెత్తారు. దీని కారణంగా ఖర్చులు పెరిగి రాష్ట్రంలోని ప్రజలంతా సమ్మెల బాట పడుతున్నారని పేర్కొన్నారు.