ఏపీలో రూ.50 వేల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం - భూమన ఆధ్వర్యంలో తిరుపతిలో రూ.4 వేల కోట్ల దోపిడీ : టీడీపీ నేత ఆనం - Anam Venkataramana Reddy allegations on YCPleaders
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 1:12 PM IST
Anam Venkataramana Reddy on YCP TDR bonds scam: రాష్ట్రంలో వేల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కుంభకోణం విలువ 45 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఒక్క తిరుపతిలోనే 4 వేల 52 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆయన భూమన కరుణాకర్రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డిలే సూత్రధారులని ఆరోపించారు. వ్యవసాయ, రెసిడెన్షియల్ స్థలాల విలువకంటే కమర్షియల్ స్థలాల విలువ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకని వ్యవసాయ భూములన్నీ కమర్షియల్గా చూపి డీకేటీ పట్టాలు, దొంగ జీపీలతో దోచుకున్నారన్నారు. ఒక్క టీడీఆర్ బాండ్కు కూడా ఈసీలు లేవన్నారు. ఈసీలు తీస్తే బండారమంతా బయటపడుతుంది. శ్రీవారి నిజరూపదర్శనం కోనేటిలో మునిగి భూమన, ఆయన తనయుడు కుంభకోణం జరగలేదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి ఎన్నిసార్లు ఆర్టీఏ కింద సమాచారం కోరినా ఇవ్వలేదు. మీరు సమాచారం ఇవ్వకున్నా మేము తెచ్చుకోగలమని ఆనం అన్నారు.