అమరావతి రైతుల పాదయాత్ర ఆగొద్దు.. అరసవల్లి వరకు ఒంటరిగానే జేఏసీ నేత పాదయాత్ర

By

Published : Jan 18, 2023, 5:50 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

 Amaravati JAC Leader Gadde Tirupati Rao: ఆంధ్రుల రాజధానిగా అమరావతే ఉండాలని అమరావతి జేఏసీ నేత గద్దె తిరుపతి రావు అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఎక్కడి నుంచి అమరావతి రైతుల పాదయాత్ర ఆగిందో అక్కడ నుంచి ఈ యాత్ర సంపూర్ణం కావాలని ఒంటరిగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. విశాఖ , ఎండాడ, మధురవాడ మీదుగా అరసవల్లి కి పాదయాత్ర చేస్తూ కదులుతున్నారు. మధురవాడ లో జాతీయ నాయకులకు విగ్రహాలకు నివాళి అర్పించిన గద్దె తిరుపతి రావు అమరావతి రైతుల ఆకాంక్ష నెరవేరాలని అరసవిల్లి సూర్య నారాయణ మూర్తి దేవాలయానికి పాదయాత్ర చేస్తున్నట్టు చెప్తున్నారు. మార్గ మధ్యలో ఉత్తరాంధ్ర వాసులు ఆప్యాయంగా పలకరిస్తున్నారని పరిస్థితిలు వల్ల మధ్య లోనే అమరావతి -అరసవిల్లికి యాత్ర నిలిచినప్పటికి , అసంపూర్తిగా కాకూడదు అనే లక్ష్యం తో సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్తున్నట్టు చెప్పారు.ఒక ఆధ్యాత్మిక భావం తో చేస్తున్న పాదయాత్ర చెప్పుకొచ్చారు.. అరసవిల్లి పాదయాత్ర చేస్తున్న అమరావతి జేఏసీ నాయకులు గద్దె తిరుపతిరావు తో మా విశాఖ ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యేక ముఖాముఖి.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.