విశాఖకు కార్యాలయాల తరలింపు కోర్టు ధిక్కారమే : ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతుల ఆగ్రహం - ఏపీ ప్రభుత్వంపై అమరావతి రైతులు ఆగ్రహం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-11-2023/640-480-20103947-thumbnail-16x9-amaravati-farmers-fires-on-cm-jagan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 5:40 PM IST
Amaravati Farmers Fires on CM Jagan: విశాఖకు ప్రభుత్వం కార్యాలయాలను తరలిస్తూ.. నిర్ణయం తీసుకోవడాన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాడు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అమరావతే రాజధాని అని చెప్పి.. ఇప్పుడు ఎలా కార్యాలయాలను తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్కు ధైర్యం ఉంటే విశాఖే ఏకైక రాజధాని అని జీవో ఇవ్వాలని అమరావతి రైతులు మండిపడ్డారు. అమరావతి అంశం దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉండగానే.. ప్రభుత్వ కార్యలయాలు తరలింపు నిర్ణయం తీసుకోవడం కోర్టు ధిక్కరణ కిందే వస్తుందని అభిప్రాయపడ్డారు.
నాలగున్నరేళ్లలో అమారవతిని అభివృద్ధి చేయలనేని జగన్.. నాలుగు నెలల్లో ఉత్తరాంధ్రను ఏం అభివృద్ధి చేస్తారని రైతులు, మహిళలు ప్రశ్నించారు. అమరావతిని నాశనం చేసిన.. సీఎం జగన్.. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడానికే అక్కడకి కార్యాలయాలను తరిలిస్తున్నారని ఆరోపించారు. నాలుగు నెలల్లో దిగిపోయే సీఎం.. విశాఖకు తరలించి ఏం చేస్తారని ప్రశ్నించారు. జగన్కు అభివృద్ధి చేయడం చేతకాదని.. కేవలం కూల్చడం.. నాశనం చేయడం మాత్రమే వచ్చని రైతులు చెప్పారు.