ETV Bharat / state

viveka murder case: వివేకా ఇంటిని మరోసారి పరిశీలించిన సీబీఐ అధికారులు

author img

By

Published : Jun 30, 2021, 12:03 PM IST

Updated : Jun 30, 2021, 2:59 PM IST

వివేకా హత్య కేసులో 24వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.

ys viveka murder case
ys viveka murder case

మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి (ys vivekananda reddy) హత్య కేసులో సీబీఐ (CBI) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పులివెందులకు చెందిన రహంతుల్లాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కడప నుంచి పులివెందుల వెళ్లిన రెండు సీబీఐ బృందాలు వెళ్లాయి. పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి అధికారులు పరిశీలించారు. ఇంట్లో వివేకా భార్య సౌభాగ్యమ్మతో చర్చించారు. వివేకా కుమార్తె సునిత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో అధికారులు మాట్లాడారు.

పులివెందులకు చెందిన ఉమామహేశ్వర్​తో పాటు సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వర్ రెడ్డిని సీబీఐ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. జగదీశ్వర్ రెడ్డి గతంలో వివేకా పొలం పనులను చూసుకునేవారు. వారం క్రితమే అతణ్ని సీబీఐ అధికారులు 3 రోజుల పాటు విచారించారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర‌ గంగిరెడ్డితో (erra gangireddy)పాటు మాజీ కారు డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి, ఆయ‌న ఇంట్లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ హిద‌య‌తుల్లా, ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉండే కిరణ్‌కుమార్ యాద‌వ్‌, సునీల్‌కుమార్ యాద‌వ్‌ల‌తో పాటు మ‌రికొంద‌రిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నిరంతరాయంగా విచారణ కొనసాగిస్తున్న సీబీఐ అధికారులు.. ఘటనపై పూర్తి వివరాలు తేల్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను ప్రశ్నించి కీలక వివరాలను రాబట్టారు.

మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి (ys vivekananda reddy) హత్య కేసులో సీబీఐ (CBI) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పులివెందులకు చెందిన రహంతుల్లాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కడప నుంచి పులివెందుల వెళ్లిన రెండు సీబీఐ బృందాలు వెళ్లాయి. పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి అధికారులు పరిశీలించారు. ఇంట్లో వివేకా భార్య సౌభాగ్యమ్మతో చర్చించారు. వివేకా కుమార్తె సునిత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో అధికారులు మాట్లాడారు.

పులివెందులకు చెందిన ఉమామహేశ్వర్​తో పాటు సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వర్ రెడ్డిని సీబీఐ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. జగదీశ్వర్ రెడ్డి గతంలో వివేకా పొలం పనులను చూసుకునేవారు. వారం క్రితమే అతణ్ని సీబీఐ అధికారులు 3 రోజుల పాటు విచారించారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర‌ గంగిరెడ్డితో (erra gangireddy)పాటు మాజీ కారు డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి, ఆయ‌న ఇంట్లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ హిద‌య‌తుల్లా, ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉండే కిరణ్‌కుమార్ యాద‌వ్‌, సునీల్‌కుమార్ యాద‌వ్‌ల‌తో పాటు మ‌రికొంద‌రిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నిరంతరాయంగా విచారణ కొనసాగిస్తున్న సీబీఐ అధికారులు.. ఘటనపై పూర్తి వివరాలు తేల్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను ప్రశ్నించి కీలక వివరాలను రాబట్టారు.

ఇదీ చదవండి:

Bank Holidays: జులైలో బ్యాంక్ సెలవులు ఇవే

Last Updated : Jun 30, 2021, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.