కడప జిల్లా బి.కోడూరు మండలం మున్నెల్లిలో విషాద ఘటన జరిగింది. కార్తిక దీపాలను వెలిగించేందుకు సగిలేరు నదిలోకి దిగిన మహిళ.. ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. సమీప గ్రామం బోడిగుండు పల్లి వద్ద చెరువు పక్కన మృతదేహం లభ్యమయ్యింది. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు మున్నెల్లి గ్రామానికి చెందిన నారమ్మగా స్థానికులు గుర్తించారు. వడ్డమాను చిదానందం దిగువ సగిలేరు జలాశయం నుంచి నదిలోకి నీటిని అధికారులు వదిలారు. నదిలోకి దిగవద్దని ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.
ఇవీ చూడండి. పెద్దకుడాల గ్రామంలో మహిళ దారుణ హత్య