ETV Bharat / state

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న వేడకకు.. అర్చకులు అంకురార్పణ చేశారు.

author img

By

Published : Apr 12, 2019, 8:39 PM IST

ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం.. బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో... శ్రీరామనవమిని పురస్కరించుకుని.. రేపటినుంచి నిర్వహించనున్న ఉత్సవాలకు... అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ నెల 22 వరకు జరగనున్న వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గత ఏడాది సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా.. వర్ష బీభత్సంతో వేదిక దెబ్బతిన్న ఘటనల నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 18న నిర్వహించనున్న కల్యాణానికి.. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో షెడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. కల్యాణం రోజు ఎవరు అధికారికంగా దేవతామూర్తులకు పట్టువస్త్రాలు సమర్పించాలన్న విషయంపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దృష్టి పెట్టారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నకల సంఘానికి లేఖ రాశారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఈ నెల 13న ధ్వజారోహణ, 14న శ్రీరామనవమి వేడుక, 15న సింహ వాహన సేవ, 16న హనుమత్ సేవ, 17న గరుడసేవ, 18న కల్యాణోత్సవం, 19న రథోత్సవం, 20న అశ్వవాహన సేవ, 21న చక్రస్నానం, 22న పుష్పయాగం జరగనున్నాయి.

ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం.. బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో... శ్రీరామనవమిని పురస్కరించుకుని.. రేపటినుంచి నిర్వహించనున్న ఉత్సవాలకు... అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ నెల 22 వరకు జరగనున్న వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గత ఏడాది సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా.. వర్ష బీభత్సంతో వేదిక దెబ్బతిన్న ఘటనల నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 18న నిర్వహించనున్న కల్యాణానికి.. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో షెడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. కల్యాణం రోజు ఎవరు అధికారికంగా దేవతామూర్తులకు పట్టువస్త్రాలు సమర్పించాలన్న విషయంపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దృష్టి పెట్టారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నకల సంఘానికి లేఖ రాశారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఈ నెల 13న ధ్వజారోహణ, 14న శ్రీరామనవమి వేడుక, 15న సింహ వాహన సేవ, 16న హనుమత్ సేవ, 17న గరుడసేవ, 18న కల్యాణోత్సవం, 19న రథోత్సవం, 20న అశ్వవాహన సేవ, 21న చక్రస్నానం, 22న పుష్పయాగం జరగనున్నాయి.

Intro:రాజు ఈటీవీ తినాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ ర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:రాష్ట్రం లో నిన్న జరిగిన నా ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తెలుగుదేశం పార్టీ నేతలు నాయకులు దౌర్జన్యాన్ని దిగారని మాజీ మంత్రి ఇ వైఎస్ఆర్ పార్టీ నీ నాయకు డు మోపిదేవి వెంకటరమణ అన్నారు గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం లో నిన్న జరిగిన సంఘటన గురించి మెరుగు నాగార్జునతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇ అధికార పార్టీ నీ డబ్బులతో ఎన్నికలు చేయాలని చూసిందని అది జరగబోయే తలకి నాయకుల మీద దొరికిన ఎదిగిందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు

బైట్ మోపిదేవి వెంకటరమణ వైఎస్సార్ పార్టీ నాయకులు


Conclusion:వైయస్సార్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఇ మోపిదేవి వెంకటరమణ వీడియో సమావేశం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.