కడప జిల్లా పులివెందులలో విషాదం నెలకొంది. తెల్లవారుజామునే కూలికి వెళ్లేందుకు జీపులో బయలుదేరిన మహిళలను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. కొత్తపల్లికి చెందిన మహిళా కూలీలు పని కోసం జీపులో వెళ్తుండగా...పులివెందులలోని ఎంవీఐ కార్యాలయం వద్దకు రాగానే... ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. పక్కనే మున్సిపాలిటీ ట్రాక్టర్ కూడా ఉండడంతో దాన్ని కూడా ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
తీవ్రంగా గాయపడిన ఆరుగురిని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించారు. పారిశుద్ధ్య పనులు చేయడానికి వెళుతున్న కార్మికులకు, కూలీ పనులకు వెళ్తున్న మహిళా కూలీలకు రోడ్డు ప్రమాదం జరగడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా ప్రదేశానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. కరోనా వల్ల రూ.21,500 కోట్ల నష్టం.. వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం