thumbnail

పోలీసులు వేధింపులతో ఆత్మహత్య- ఆందోళనకు దిగిన కుటుంబసభ్యులు - MAN SUICIDE ON POLICE HARASSMENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

A Man Committed Suicide by Drinking Pesticide Due to Police Harassment : పోలీసులు వేధింపులు తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఈరోజు(ఆదివారం) పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో బాధితుడి మృతదేహంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని పొన్నలూరు మండలం పరుచూరివారిపాలేనికి చెందిన రాజశేఖర్, కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెంలోని ఓ హేచరీలో గతంలో పని చేసేవాడని తెలిపారు. ఆ సమయంలో హేచరీ నిధులను రాజశేఖర్‌ పక్కదారి పట్టించారని యజమాని సుధాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడని వెల్లడించారు. 

దీంతో విచారణ కోసం రాజశేఖర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్రంగా కొట్టాడని ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్థాపనికి గురైన రాజశేఖర్ నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని వివరించారు. ఈరోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడని తెలిపారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే రాజశేఖర్‌ పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం చేసి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో న్యాయం చేయాలని బాధితుడి మృతదేహంతో రిమ్స్‌ ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.