ETV Bharat / state

'వైకాపా ప్రభుత్వం అన్నింట్లో విఫలమైంది'

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని... రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. లాక్ డౌన్ సమస్యల పరిష్కారంలోనూ వైఫల్యం చెందిందని విమర్శించారు.

author img

By

Published : May 2, 2020, 5:54 PM IST

tulasi reddy criticizes ycp government
వైకాపా ప్రభుత్వంపై తులసిరెడ్డి విమర్శలు

కరోనా వ్యాప్తి నివారణలో, లాక్ డౌన్ సమస్యల పరిష్కారంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన... జాతీయ స్థాయిలో రెడ్ జోన్ జిల్లాల శాతం 17.66 శాతం ఉంటే.. ఆంధ్రప్రదేశ్​లో 7.6 శాతం ఉండడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంలేదని రాష్ట్ర ప్రత్యేకాధికారి హరినారాయణ స్పష్టంగా చెప్పారన్నారు. ప్రతిఒక్కరికీ మాస్కులు పంపిణీ చేస్తామని చెప్పినా... క్షేత్రస్థాయిలో అది జరగడంలేదని ధ్వజమెత్తారు. ప్రజలకు రేషన్​తో పాటు నిత్యావసరాలు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు.

కరోనా వ్యాప్తి నివారణలో, లాక్ డౌన్ సమస్యల పరిష్కారంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన... జాతీయ స్థాయిలో రెడ్ జోన్ జిల్లాల శాతం 17.66 శాతం ఉంటే.. ఆంధ్రప్రదేశ్​లో 7.6 శాతం ఉండడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంలేదని రాష్ట్ర ప్రత్యేకాధికారి హరినారాయణ స్పష్టంగా చెప్పారన్నారు. ప్రతిఒక్కరికీ మాస్కులు పంపిణీ చేస్తామని చెప్పినా... క్షేత్రస్థాయిలో అది జరగడంలేదని ధ్వజమెత్తారు. ప్రజలకు రేషన్​తో పాటు నిత్యావసరాలు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి.. కనీసం లక్ష పడకలు సిద్ధం చేయండి: సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.