కడప జిల్లా బద్వేలులో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఎప్పుడు జనంతో రద్దీగా ఉండే వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర వేళల్లోనే జనం రోడ్లపైకి వస్తున్నారు. బస్సులు ఆర్టీసీ డిపోకే పరిమితమయ్యాయి. దుకాణాలు మూతపడ్డాయి. ఏటీఎంలు జనం లేకుండా దర్శనమిస్తున్నాయి. మెడికల్ షాపులు, ఆసుపత్రులు మాత్రమే పనిచేస్తున్నాయి.
ఇదీ చదవండి: అప్రమత్తతే వైరస్కు విరుగుడు.. ఇది ప్రతి పౌరుడి బాధ్యత