ETV Bharat / state

బైక్ ను ఢీకొట్టిన కారు.. మేనమామ మృతి.. అల్లుడికి గాయాలు

author img

By

Published : Jun 10, 2020, 6:44 AM IST

మేనల్లుడికి ప్రేమతో తినుబండారాలు కొనిపెడదాం అని బైక్ ఎక్కించుకుని అల్లుడిని షికారుకు తీసుకొచ్చాడా మామ. ఇంతలోనే కారు రూపంలో వచ్చిన మృత్యువు మామను పొట్టనబెట్టుకుంది. కడప జిల్లా రాయచోటి పట్టణంలో ఈ విషాదకర సంఘటన.. కుటుంబీకులకు తీరని వ్యథ మిగిల్చింది.

road accident in kadapa dst rayachoti one died one injured
road accident in kadapa dst rayachoti one died one injured

కడప జిల్లా రాయచోటిలోని మాసాపేటలో నివాసం ఉంటున్న రెడ్డి బాషా (35) అనే వ్యక్తి.. తన మేనల్లుడు సిద్దిక్ (10 )ను ద్విచక్ర వాహనం ఎక్కించుకుని తినుబండారాలు కొనిపెట్టేందుకు దుకాణానికి వెళ్లాడు. కడప వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొట్టిన ఘటనలో.. రెడ్డి బాషా తీవ్రంగా గాయపడ్డాడు.

ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. సిద్ధిక్ తీవ్ర గాయాలతో బయటపడగా స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కడప రిమ్స్ కు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

కడప జిల్లా రాయచోటిలోని మాసాపేటలో నివాసం ఉంటున్న రెడ్డి బాషా (35) అనే వ్యక్తి.. తన మేనల్లుడు సిద్దిక్ (10 )ను ద్విచక్ర వాహనం ఎక్కించుకుని తినుబండారాలు కొనిపెట్టేందుకు దుకాణానికి వెళ్లాడు. కడప వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొట్టిన ఘటనలో.. రెడ్డి బాషా తీవ్రంగా గాయపడ్డాడు.

ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. సిద్ధిక్ తీవ్ర గాయాలతో బయటపడగా స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కడప రిమ్స్ కు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

1010 కిలోల గంజాయి స్వాధీనం.. విలువ రూ. కోటి పైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.