ETV Bharat / state

అందని పెట్టుబడి రాయితీ... కర్షకుల ఇంట కనిపించని సంక్రాంతి...

author img

By

Published : Jan 15, 2021, 1:42 PM IST

కడప జిల్లాలోని రైతుల ఇంట సంక్రాంతి పండగ శోభ కనిపించడంలేదు. వీరికి 2020 ఏ మాత్రం కలిసిరాలేదు. మార్చి నుంచి కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో అవస్థలు పడ్డారు. ఈ పరిస్థితి నుంచి మెల్లగా కోలుకుంటున్న తరుణంలో నివర్‌ తుపా నిండాముంచింది. ఒక్కో రైతు పెట్టిన వేల రూపాయల పెట్టుబడి నీటిపాలైంది. పంట నష్టపోయిన వారికి డిసెంబరు నెలాఖరు నాటికి పెట్టుబడి రాయితీ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంత వరకు అవీ అందలేదని వాపోతున్నారు కర్షకులు.

Request to support the invisible wallpaper charm of the farmer's house
కర్షకుల ఇంట కనిపించని సంక్రాంతి శోభ.. ఆదుకోవాలని వినతి

కడప జిల్లాలోని రైతుల ఇంట సంక్రాంతి పండగ శోభ కనిపించడంలేదు. వీరికి 2020 ఏ మాత్రం కలిసిరాలేదు. మార్చి నుంచి కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం సక్రమంగా లేక అవస్థలు పడ్డారు. ఈ పరిస్థితి నుంచి మెల్లగా కోలుకుంటున్న తరుణంలో నివర్‌ తుపాను నిండాముంచింది. ఒక్కో రైతు పెట్టిన వేల రూపాయల పెట్టుబడి నీటిపాలైంది. పంట నష్టపోయిన వారికి డిసెంబరు నెలాఖరు నాటికి పెట్టుబడి రాయితీ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే జిల్లాలో ఇప్పటివరకు చాలామంది రైతులకు సొమ్ములు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నివర్‌ తుపాను ధాటికి జిల్లాలోని రైతులకు వాటిల్లిన నష్టాలను లెక్కించే ప్రక్రియ కొన్ని చోట్ల సక్రమంగా జరగలేదు. ఇందుకు ఎర్రగుంట్ల మండలం మాలెపాడులో జరిగిన లోపాలే నిదర్శనం. గ్రామంలో భారీ వర్షాలకు మొత్తం 685 మంది రైతులు నష్టపోయినట్లు సంబంధిత వ్యవసాయాధికారి గుర్తించారు. అయితే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కేవలం 385 మంది రైతుల వివరాలను మాత్రమే ప్రభుత్వానికి పంపించారు. ఫలితంగా గ్రామంలో అర్హులైన 300 మంది అన్నదాతలకు పెట్టుబడి రాయితీ సొమ్ములు అందలేదు. ఈ నెల 6వ తేదీ వరకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఆయా రైతులు స్థానిక అధికారులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ప్రభుత్వానికి పంపిన నివేదికలో సాంకేతిక లోపాలతో 300 మంది రైతుల వివరాలు గల్లంతయ్యాయని అధికారులు చెప్పుకొచ్చారు. ఇది బయటపడ్డాక కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం కాలేదని బాధిత రైతులు చెబుతున్నారు. కష్టనష్టాల్లో ఉన్న తమ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పెట్టుబడి రాయితీ సొమ్ములు అందించి ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు.

సంక్రాంతి పండగ లేదు...


నాకున్న 2.10 ఎకరాల్లో శనగ పంట సాగు చేశాను. నివర్‌ తుపాను ధాటికి మొత్తం నష్టపోయాను. ఇప్పటివరకు నాకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందలేదు. గతేడాది డిసెంబరు 29వ తేదీన కొంత మందికి మాత్రమే పెట్టుబడి రాయితీ వచ్చింది. ఈ సారి మాకు సంక్రాంతి పండగ లేదు. ప్రభుత్వం వెంటనే డబ్బులు మంజూరు చేయాలి. - బంగారయ్య, రైతు, మాలెపాడు
మళ్లీ పంటలు వేయలేదు...
నివర్‌ తుపాను ప్రభావంతో 2.5 ఎకరాల్లో పత్తి, మరో 2.37 ఎకరాల్లో శనగ పంటలు నష్ట పోయాం. ఇప్పటివరకు డబ్బులు జమకాలేదు. శనగ విత్తనాలు సరిపడా ఇవ్వకపోవడంతో మళ్లీ పంటలు వేయలేదు. - నాగరాజేశ్వరి, రైతు, మాలెపాడు


అడిగిన పత్రాలన్నీ ఇచ్చాను...


నేను 15 ఎకరాల్లో శనగ పంట వేశాను. భారీ వర్షాలకు దెబ్బతింది. అధికారులు అడిగిన పత్రాలన్నీ ఇచ్చినా పెట్టుబడి రాయితీ రాలేదు. - రామ్మోహన్‌రెడ్డి, రైతు, మాలెపాడు
పూట గడవడమే కష్టంగా ఉంది...
మూడెకరాల్లో శనగ పంట నష్టపోయాం. మాకు డబ్బులు రాలేదు. ప్రస్తుతం పూట గడవడం కష్టంగా ఉంది. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి. - చంద్రకళ, రైతు, మాలెపాడు

డబ్బులందని విషయం వాస్తవమే...


మాలెపాడులో 300 మంది అర్హులైన రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్ములు అందని విషయం వాస్తవమే. సిబ్బంది పొరపాటుతో ఇలా జరిగిందని ప్రాథమికంగా గుర్తించాం. దీనిపై సమగ్ర పరిశీలన జరిపి నివేదికను రూపొందించాం. అర్హులైన రైతులందరికీ డబ్బులు అందేలా కృషి చేస్తాం. - మురళీకృష్ణ, జేడీ, వ్యవసాయశాఖ, కడప జిల్లా

ఇదీ చదవండి:

నర్సీపట్నంలో మకర జ్యోతి ఉత్సవాలకు ఏర్పాట్లు

కడప జిల్లాలోని రైతుల ఇంట సంక్రాంతి పండగ శోభ కనిపించడంలేదు. వీరికి 2020 ఏ మాత్రం కలిసిరాలేదు. మార్చి నుంచి కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం సక్రమంగా లేక అవస్థలు పడ్డారు. ఈ పరిస్థితి నుంచి మెల్లగా కోలుకుంటున్న తరుణంలో నివర్‌ తుపాను నిండాముంచింది. ఒక్కో రైతు పెట్టిన వేల రూపాయల పెట్టుబడి నీటిపాలైంది. పంట నష్టపోయిన వారికి డిసెంబరు నెలాఖరు నాటికి పెట్టుబడి రాయితీ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే జిల్లాలో ఇప్పటివరకు చాలామంది రైతులకు సొమ్ములు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నివర్‌ తుపాను ధాటికి జిల్లాలోని రైతులకు వాటిల్లిన నష్టాలను లెక్కించే ప్రక్రియ కొన్ని చోట్ల సక్రమంగా జరగలేదు. ఇందుకు ఎర్రగుంట్ల మండలం మాలెపాడులో జరిగిన లోపాలే నిదర్శనం. గ్రామంలో భారీ వర్షాలకు మొత్తం 685 మంది రైతులు నష్టపోయినట్లు సంబంధిత వ్యవసాయాధికారి గుర్తించారు. అయితే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కేవలం 385 మంది రైతుల వివరాలను మాత్రమే ప్రభుత్వానికి పంపించారు. ఫలితంగా గ్రామంలో అర్హులైన 300 మంది అన్నదాతలకు పెట్టుబడి రాయితీ సొమ్ములు అందలేదు. ఈ నెల 6వ తేదీ వరకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఆయా రైతులు స్థానిక అధికారులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ప్రభుత్వానికి పంపిన నివేదికలో సాంకేతిక లోపాలతో 300 మంది రైతుల వివరాలు గల్లంతయ్యాయని అధికారులు చెప్పుకొచ్చారు. ఇది బయటపడ్డాక కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం కాలేదని బాధిత రైతులు చెబుతున్నారు. కష్టనష్టాల్లో ఉన్న తమ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పెట్టుబడి రాయితీ సొమ్ములు అందించి ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు.

సంక్రాంతి పండగ లేదు...


నాకున్న 2.10 ఎకరాల్లో శనగ పంట సాగు చేశాను. నివర్‌ తుపాను ధాటికి మొత్తం నష్టపోయాను. ఇప్పటివరకు నాకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందలేదు. గతేడాది డిసెంబరు 29వ తేదీన కొంత మందికి మాత్రమే పెట్టుబడి రాయితీ వచ్చింది. ఈ సారి మాకు సంక్రాంతి పండగ లేదు. ప్రభుత్వం వెంటనే డబ్బులు మంజూరు చేయాలి. - బంగారయ్య, రైతు, మాలెపాడు
మళ్లీ పంటలు వేయలేదు...
నివర్‌ తుపాను ప్రభావంతో 2.5 ఎకరాల్లో పత్తి, మరో 2.37 ఎకరాల్లో శనగ పంటలు నష్ట పోయాం. ఇప్పటివరకు డబ్బులు జమకాలేదు. శనగ విత్తనాలు సరిపడా ఇవ్వకపోవడంతో మళ్లీ పంటలు వేయలేదు. - నాగరాజేశ్వరి, రైతు, మాలెపాడు


అడిగిన పత్రాలన్నీ ఇచ్చాను...


నేను 15 ఎకరాల్లో శనగ పంట వేశాను. భారీ వర్షాలకు దెబ్బతింది. అధికారులు అడిగిన పత్రాలన్నీ ఇచ్చినా పెట్టుబడి రాయితీ రాలేదు. - రామ్మోహన్‌రెడ్డి, రైతు, మాలెపాడు
పూట గడవడమే కష్టంగా ఉంది...
మూడెకరాల్లో శనగ పంట నష్టపోయాం. మాకు డబ్బులు రాలేదు. ప్రస్తుతం పూట గడవడం కష్టంగా ఉంది. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి. - చంద్రకళ, రైతు, మాలెపాడు

డబ్బులందని విషయం వాస్తవమే...


మాలెపాడులో 300 మంది అర్హులైన రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్ములు అందని విషయం వాస్తవమే. సిబ్బంది పొరపాటుతో ఇలా జరిగిందని ప్రాథమికంగా గుర్తించాం. దీనిపై సమగ్ర పరిశీలన జరిపి నివేదికను రూపొందించాం. అర్హులైన రైతులందరికీ డబ్బులు అందేలా కృషి చేస్తాం. - మురళీకృష్ణ, జేడీ, వ్యవసాయశాఖ, కడప జిల్లా

ఇదీ చదవండి:

నర్సీపట్నంలో మకర జ్యోతి ఉత్సవాలకు ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.