ETV Bharat / state

పోలీసుల అదుపులో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు

author img

By

Published : May 7, 2021, 8:38 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లె చెక్​పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న.. ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరటి గెలల చాటున దుంగలను తరలిస్తున్నారన్న సమాచారంతో.. పోలీసులు వాహనాలను తనీఖీలు చేశారు. రూ.6లక్షలు విలువచేసే ఎర్రచందనం దుంగలు, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

red sandal smugglers arrest
red sandal smugglers arrest

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లె చెక్​పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న.. రూ.6లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వాహనంలో అరటి గెలల చాటున అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్నారన్న సమాచారంతో.. బాలపల్లె చెక్​పోస్టు వద్ద పోలీసులు తనీఖీలు చేపట్టారు.

దుంగలను తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని.. వారి వద్దనున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు బలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. 80 ఎర్రచందనం దుంగల విలువ.. సుమారు రూ. 6 లక్షలుగా ఉంటుందని తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లె చెక్​పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న.. రూ.6లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వాహనంలో అరటి గెలల చాటున అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్నారన్న సమాచారంతో.. బాలపల్లె చెక్​పోస్టు వద్ద పోలీసులు తనీఖీలు చేపట్టారు.

దుంగలను తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని.. వారి వద్దనున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు బలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. 80 ఎర్రచందనం దుంగల విలువ.. సుమారు రూ. 6 లక్షలుగా ఉంటుందని తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

600 కిలోల గంజాయి స్వాధీనం.. పోలీసుల అదుపులో నిందితుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.