శ్రీశైలం జలాశయం నిండి... నీరు సముద్ర పాలవుతున్నా కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్కు నీరు ఇవ్వలేకపోతున్నారని తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. కడప జిల్లా మైదుకూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన... తెదేపా ప్రభుత్వ హయాంలో ఒకసారి మాత్రమే జలాశయానికి నీరు చేరినా బ్రహ్మ సాగర్ జలాశయంలో 8 టీఎంసీల నీరు నింపినట్లు తెలిపారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మాదిరిగా తక్కువ ధరకే ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యకర్తలపై వేధింపులు, దాడులకు పాల్పడితే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి