ETV Bharat / state

వ్యక్తి ప్రాణం తీసిన పాగేరు వంక

author img

By

Published : Oct 3, 2020, 2:25 PM IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు నిండుకుండలా మారాయి. వాటి దారికి అడ్డం వచ్చిన వేటినీ వదలకుండా గల్లంతు చేస్తున్నాయి. ప్రమాదవశాత్తు కడపలోని కమలాపురం పాగేరు వంకలో పడిపోయిన శరత్ కుమార్ రెడ్డి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం అతని మృతదేహం లభించింది.

Paderu death
పాడేరులో గల్లంతైన వ్యక్తి మృతి

కడప జిల్లా పాగేరు వంకలో మూడు రోజుల క్రితం గల్లంతైన శరత్ కుమార్ రెడ్డి మృతదేహం ఎట్టకేలకు లభించింది. అప్పటినుంచి గాలిస్తున్న ఫైర్ సిబ్బంది.. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అతడిని గుర్తించారు. అతనికొక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఖాజీపట నుంచి చెప్పలి వెళ్తున్న శరత్ కుమార్ రెడ్డి దంపతులు మార్గంమధ్యలో ప్రమాదవశాత్తు కమలాపురం పాగేరు వంకలో పడిపోయారు. స్థానికులు అతడి భార్య ఐశ్వర్యను కాపాడారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించగా.. ప్రవాహంలో కొట్టుకుపోయిన శరత్ ఆచూకీ మూడు రోజుల తర్వాత లభించింది.

కడప జిల్లా పాగేరు వంకలో మూడు రోజుల క్రితం గల్లంతైన శరత్ కుమార్ రెడ్డి మృతదేహం ఎట్టకేలకు లభించింది. అప్పటినుంచి గాలిస్తున్న ఫైర్ సిబ్బంది.. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అతడిని గుర్తించారు. అతనికొక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఖాజీపట నుంచి చెప్పలి వెళ్తున్న శరత్ కుమార్ రెడ్డి దంపతులు మార్గంమధ్యలో ప్రమాదవశాత్తు కమలాపురం పాగేరు వంకలో పడిపోయారు. స్థానికులు అతడి భార్య ఐశ్వర్యను కాపాడారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించగా.. ప్రవాహంలో కొట్టుకుపోయిన శరత్ ఆచూకీ మూడు రోజుల తర్వాత లభించింది.

ఇదీ చదవండి: సాయంత్రం గంగిరెడ్డి అంత్యక్రియలు..హాజరుకానున్న సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.