ETV Bharat / state

ఒక ఆధార్​ కార్డుకు... ఒక కిలో ఉల్లి..! - ఒక్క ఆధార్​కి కిలో ఉల్లిపాయలు వార్త

కడప జిల్లాలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై ఉల్లి సరఫరా చేస్తున్నారు. కిలో ఉల్లి రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఉల్లిపాయల కోసం బారులు తీరారు.

one Aadhaar is one kilogram of onions at kadapa
కడపలో ఒక్క ఆధార్​కి..ఒక కిలో ఉల్లిపాయలు
author img

By

Published : Dec 14, 2019, 11:46 AM IST

ఒక ఆధార్​ కార్డుకు... ఒక కిలో ఉల్లి..!

కడప జిల్లాలో ఉల్లిధరతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులకు ఉపశమనం కలిగింది. తక్కువ ధరకే ప్రభుత్వం ఉల్లి విక్రయాలు చేపట్టింది. జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో పంపిణీ చేస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కొక్కరికి కిలో చొప్పున అందజేస్తున్నారు. రైల్వేకోడూరులో ప్రైవేట్ మార్కెట్​లో ఉల్లి రూ.100పైగా ఉంది. కుటుంబానికి ఒక కేజీ ఉల్లిగడ్డలు సరిపోవటంలేదని... ఎక్కువగా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. జమ్మలమడుగులో గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బద్వేలులో ఉల్లిపాయల కోసం ప్రజలు పెద్దఎత్తున ఎగబడ్డారు.

ఒక ఆధార్​ కార్డుకు... ఒక కిలో ఉల్లి..!

కడప జిల్లాలో ఉల్లిధరతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులకు ఉపశమనం కలిగింది. తక్కువ ధరకే ప్రభుత్వం ఉల్లి విక్రయాలు చేపట్టింది. జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో పంపిణీ చేస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కొక్కరికి కిలో చొప్పున అందజేస్తున్నారు. రైల్వేకోడూరులో ప్రైవేట్ మార్కెట్​లో ఉల్లి రూ.100పైగా ఉంది. కుటుంబానికి ఒక కేజీ ఉల్లిగడ్డలు సరిపోవటంలేదని... ఎక్కువగా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. జమ్మలమడుగులో గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బద్వేలులో ఉల్లిపాయల కోసం ప్రజలు పెద్దఎత్తున ఎగబడ్డారు.

ఇదీ చదవండి:

ఉల్లిపాయలు లేవని.. కాంగ్రెస్​ నేత వేలు కొరికిన యువకుడు!

Intro:Ap_cdp_48_13_VO_ulli kendram_prarambam_Av_Ap10043
k.veerachari, 9948047582
ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో కడప జిల్లా రాజంపేట మార్కెట్ యార్డ్ లో ఉల్లి కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉల్లి సమస్య ఉందని చెప్పారు. ఈ సమస్యను తెలుసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పులి కేంద్రాలను ఏర్పాటు చేసి సబ్సిడీపై కిలో ఇరవై ఐదు రూపాయలకే అందజేస్తున్నారని తెలిపారు. అయినా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రస్తుతం రాజంపేట మార్కెట్ యార్డుకు మూడు టన్నుల ఉల్లి వచ్చిందని, త్వరలో మరింత స్టాక్ వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు కమిటీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి వైకాపా నాయకులు పాల్గొన్నారు.


Body:రాజంపేటలో ఉల్లి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


Conclusion:ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.