కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని... తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని ఆలయ పండితులు కమనీయంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారు. లాక్డౌన్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. కేవలం వేద పండితులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సమక్షంలో... ఎలాంటి ఆర్భాటాలు లేకుండా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు.
ఇదీ చదవండి: