కడప జిల్లా పులివెందులలో రెండు వాటర్ ప్లాంట్లను, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద 'జగనన్న మహిళా మార్ట్' ఎంపీ అనివాష్రెడ్డి ప్రారంభించారు. రిలయన్స్, మోర్ లాంటి సంస్థల కన్నా పది శాతం తక్కువ ధరలకు ఇక్కడ నిత్యావసర సరుకులు లభిస్తాయని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళలందరూ కలిసి ఒక్కొక్క సభ్యురాలు రూ.150 చొప్పున కలెక్ట్ చేసి 15 లక్షల రూపాయలతో ఈ మార్ట్ను ఏర్పాటు చేశారని ఎంపీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ సరుకులు కొనుగోలు చేస్తే కోట్ల రూపాయలు టర్నోవర్ జరిగే అవకాశం ఉందని అవినాష్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: