కడప జిల్లా రాయచోటిలో వెలసిన తోపు గంగమ్మ ఆలయంలో శనివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. చాందినీబడిపై అమ్మవారిని పట్టణ పురవీధుల్లో విహరింపచేశారు. భక్తులు చేసిన సంప్రదాయ చెక్క భజనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అడుగడుగున అమ్మవారికి పూజలు చేస్తూ పసుపు-కుంకుమ అందజేస్తూ ఆడపడుచులు మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఇదీ చదవండి: