జాతీయ రహదారిపై పండుగ రద్దీ - విజయవాడ వైపు బారులుదీరిన వాహనాలు - Toll Gate Rush At Keesara Village - TOLL GATE RUSH AT KEESARA VILLAGE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2024, 3:57 PM IST
Nandigama National Highway : దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు తరలివెళ్తున్న జనంతో ఎన్టీఆర్ జిల్లా- నందిగామలో జాతీయ రహదారి రద్దీగా మారింది. శనివారం, ఆదివారం సెలవులు కావడం, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో దసరా పండుగను తమ కుటుంబంతో కలిసి జరుపుకొనేందుకు తమ సొంత ప్రాంతాలకు తరలివస్తున్నారు.
హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి పై వాహనాల రద్దీ క్రమంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం నుంచి వాహనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో కంచికచర్ల మండలం కీసర గ్రామం వద్ద జాతీయ రహదారిపై టోల్ ప్లాజాలో సమీపాన వాహనాలు బారులు తీరుతున్నాయి. వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్ ప్లాజా వద్ద వాహనాలు వెళ్లేందుకు వీలుగా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. టోల్ ప్లాజా వద్ద వాహనాలు పెరుగుతూ ఉండటంతో ఇక్కడి నుంచి వెళ్లేందుకు క్యూ లైన్లలో వేచి ఉండవలసి వస్తోంది. దీనిని అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు.