ETV Bharat / state

మలేరియా బాధితురాలు మృతి.. కుటుంబీకుల ఆందోళన - డాక్టర్​ నిర్లక్ష్యం తాజా వార్తలు

మలేరియాతో చికిత్స పొందిన మహిళ చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని.. వైద్యం వికటించే ఆమె చనిపోయిందని కుటుంబీకులు ఆందోళనకు దిగారు.

girl dead by doctor negligence in treatment at kadapa
వైద్యం వికటించి మహిళ మృతి
author img

By

Published : May 11, 2020, 1:47 PM IST

కడప జిల్లా పులివెందులలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో మలేరియా బాధితురాలు మృతి చెందింది. తొండూరు మండలం సంతకొవ్వూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి.. మలేరియాతో బాధపడుతూ చికిత్స తీసుకుంది. ఆమె రక్తం వాంతులు చేసుకుంటున్న కారణంగా.. ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆమె మృతి చెందింది.

డాక్టరు కారణంగానే లక్ష్మీ దేవి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. శ్రీ రాజా రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​కు వైద్యం కోసం వస్తే ప్రాణాలు తీశారని బాధితులు ఆవేదన చెందగా.. వారికి పోలీసులు నచ్చజెప్పి అక్కడినుంచి పంపించారు.

కడప జిల్లా పులివెందులలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో మలేరియా బాధితురాలు మృతి చెందింది. తొండూరు మండలం సంతకొవ్వూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి.. మలేరియాతో బాధపడుతూ చికిత్స తీసుకుంది. ఆమె రక్తం వాంతులు చేసుకుంటున్న కారణంగా.. ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆమె మృతి చెందింది.

డాక్టరు కారణంగానే లక్ష్మీ దేవి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. శ్రీ రాజా రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​కు వైద్యం కోసం వస్తే ప్రాణాలు తీశారని బాధితులు ఆవేదన చెందగా.. వారికి పోలీసులు నచ్చజెప్పి అక్కడినుంచి పంపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.